హైదరాబాద్ లో రోజురోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్ కు చెక్ పెట్టేందుకు జిహెచ్ఎంసి, ట్రాఫిక్ పోలీసులు అనేక కార్యక్రమాలు చేపట్టారు. రోడ్ల పరిస్థితి, ఆయా రోడ్లపై సగటును రాకపోకలు చేస్తున్న వాహనాలను దృష్టిలో ఉంచుకుని చర్యలు తీసుకుంటున్నారు. ఇంతవరకూ బాగానే ఉన్నప్పటికీ అధికారులు తీసుకుంటున్న చర్యలు నగరవాసులకు ఇబ్బందులు కలిగించడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో బడాబాబులకు మేలు చేసేవిగా ఉంటున్నాయి. జూబ్లీహిల్ప్, బంజారాహిల్స్, ఫిలింనగర్ ల మధ్య ఉన్న కెబిఆర్ పార్క్ కు ఓవైపు చేయదలచిన రోడ్ వెడల్పు కార్యక్రమం పట్ల స్థానికులు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. జూబ్లీహిల్ప్ రోడ్ నెంబర్ 92ను వెడల్పు చేసే క్రమంలో ఈ రోడ్ లో ఉన్న జర్నలిస్టు కాలనీ నిర్మాణాలను కూల్చివేసేందుకు నోటీసులు ఇస్తున్నారు. కెబిఆర్ పార్క్ ను ఆనుకుని ఉన్న ఈ రోడ్ ను వెడల్పు చేయడం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అవసరమే అయినప్పటికీ అధికారులు అనుసరిస్తున్న రూట్ మ్యాప్ సరిగా లేదని స్థానికులు వాపోతున్నారు. జూబ్లీహిల్ప్ హౌసింగం సొసైటీ నిబంధనలకు విరుద్ధంగా ఈ రోడ్ లో భారీ బహుళ అంతస్తుల భవనాలను కాపాడేందుకే తమ నిర్మాణాలను కూల్చివేసేందుకు నోటీసులు ఇస్తున్నారని స్థానికులంటున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రేపు మరోసారి ముంబైకి వెళ్లనున్నారు. కొంతకాలంగా రొటేటర్ కఫ్ గాయంతో బాధపడుతున్న ఆయన..భుజాలకు సంబంధించిన చికిత్స చేయించుకోనున్నారు. రెండు భుజాల కండరాలు దెబ్బతినడంతో ఇబ్బంది పడుతున్న పవన్ కల్యాణ్..ముంబై హాస్పిటల్లో ఇప్పటికే వైద్య పరీక్షలు…
- హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.అమెరికాలో హెచ్-1బీ, పర్మ్ వర్క్ వీసాల జారీలో జరుగుతున్న అక్రమాలపై ట్రంప్ ప్రభుత్వం భారీ దర్యాప్తు చేపట్టింది. అమెరికా కార్మిక శాఖ ఇన్స్పెక్టర్ జనరల్ ఆంథోనీ డి’ఎస్పోసిటో వెల్లడించిన వివరాల ప్రకారం.. వీసా మోసాలపై ఇప్పటికే డజన్ల కొద్దీ సమ్మన్లు, సబ్పోనాలు…
- అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలక అడుగు పడుతోంది. ఇప్పటికే కేంద్ర కార్యాలయాలు, బ్యాంకులు, హోటల్స్, విద్యా సంస్థలతో రూపుదిద్దుకుంటున్న రాజధాని ప్రాంతానికి ఇప్పుడు హైటెక్ స్కై కనెక్టివిటీ కూడా అందుబాటులోకి రానుంది. ఉండవల్లి సమీపంలో ఆధునిక సదుపాయాలతో హెలిపోర్ట్…
- భారత్-ఆస్ట్రేలియా సీఈఓలతో ప్రధాని మోదీ కీలక భేటీ.భారత్-ఆస్ట్రేలియా మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథనీ అల్బనీస్తో కలిసి ఇరు దేశాల ప్రముఖ సీఈఓలు, వ్యాపార దిగ్గజాలతో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల…
- చెన్నై ఎగ్మూర్లోని ఆస్పత్రుల్లో సీఎం విజయ్ ఆకస్మిక తనిఖీలు.తమిళనాడు సీఎం విజయ్ పాలనలో తన మార్క్ చూపిస్తున్నారు. అవినీతి లేని పాలన అందిస్తానని చెబుతున్న విజయ్..ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఆధారాలతో సహా అవినీతి అధికారుల సమాచారం అందిస్తే వారిపై చర్యలు తీసుకుంటానని ప్రకటించిన ముఖ్యమంత్రి..తాజాగా ప్రభుత్వాస్పత్రుల్లో ఆకస్మిక…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 194506