Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home Crime జ్యోతిష్మతి కాలేజీ విద్యార్థి శవం లభ్యం…

జ్యోతిష్మతి కాలేజీ విద్యార్థి శవం లభ్యం…

by Prakash
Found student's body


ఈ నెల ఒకటో తేదీన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో గల జ్యోతిష్మతీ కళాశాల నుండి బయటకు వెళ్లి అదృశ్యమైన ఎనగంటి అభిలాష్ (20) మృత దేహం లభ్యమైనట్లు ఎల్ఎండీ పోలీసులు తెలిపారు. తిమ్మాపూర్ సీఐ స్వామి, ఎల్ఎండీ ఎస్సై చేరాలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల ఒకటో తేదీన జ్యోతిష్మతీ ఇంజినీరింగ్ కళాశాలలో డిప్లొమా మొదటి సంవత్సరం చదువుతున్న ఎనగంటి అభిలాష్ కళాశాల హాస్టల్ నుండి అదృశ్యమైనట్లు తండ్రి ఎనగంటి శ్రీనివాస్ ఈ నెల మూడో తేదీన ఎల్ఎండీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు తిమ్మాపూర్ పోలీసులు తెలిపారు.

అప్పటి నుండి ఇప్పటి వరకు పలు కోణాల్లో ధర్యాప్తు చేపట్టగా.. ఈ రోజు మహాత్మనగర్ శివారులోని జ్యోతిభాపూలే పాఠశాల సమీపంలోని గవ్వ రవీంధర్ రెడ్డి వ్యవసాయ బావిలో అభిలాష్ మృత దేహమును పోలీసులు గుర్తించారు. బావిలో శవాన్ని బయటకు తీసి బట్టలను, సెల్ పోన్ ఆధారంగా అభిలాష్ మృతదేహాన్ని తండ్రి శ్రీనివాస్, బంధువులు గుర్తించినారు. అభిలాష్ మృతదేహానికి అక్కడే కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులచే పోస్టుమార్టం నిర్వహించారు. కాగా అభిలాష్ మృతిపై అనుమానాలు ఉన్నట్లు తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదు చేయగా ఆ కోణంలో ధర్యాప్తు చేస్తున్నామని తిమ్మాపూర్ సీఐ స్వామి, ఎల్ఎండీ ఎస్సై చేరాలు తెలిపారు…

Advertisements

You may also like

Our Visitor

018635
Total views : 89056

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.