హైదరాబాద్ లోక్ భవన్లో ఇద్దరు హేమాహేమీల భేటీ ఆసక్తికరంగా మారింది. భారత మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ను, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. స్నేహపూర్వక వాతావరణంలో జరిగిన ఈ సమావేశంలో దేశానికి సంబంధించిన పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి. ప్రధానంగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన వన్ నేషన్ – వన్ ఎలక్షన్ అంశంపై రామ్ నాథ్ కోవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అధ్యక్షత వహించిన కమిటీ నివేదికను ఇప్పటికే భారత రాష్ట్రపతికి సమర్పించామని, ప్రస్తుతం ఆ నివేదిక పార్లమెంట్ పరిశీలనలో భాగంగా జాయింట్ పార్లమెంటరీ కమిటీ వద్ద ఉందని ఆయన వివరించారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు తమ మధ్య ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. దత్తాత్రేయ ఆరోగ్య పరిస్థితిని, ఆయన దినచర్యను అడిగి తెలుసుకున్న కోవింద్.. ఆప్యాయంగా పలకరించారు. ఇరు నేతల మధ్య జరిగిన ఈ భేటీ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.
హైదరాబాద్లో మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్తో బండారు దత్తాత్రేయ భేటీ..
49





Total views : 62069