Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Andhra Pradesh జగన్ పాలనలో బీసీలకు రక్షణ కరువు..

జగన్ పాలనలో బీసీలకు రక్షణ కరువు..

by Prakash
kaluva srinivasulu

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో బీసీలకు రక్షణ కరువైందని మాజీ మంత్రి, టిడిపి పార్టీ రాష్ట్ర పొలిట్ బ్యూరొ సభ్యులు కాలువ శ్రీనివాసులు ఆందోళన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ నాయకుల ఆగడాలు, ఆకృత్యాలు రోజురోజుకు హెచ్చు మీరుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నాయకుల దౌర్జన్యాలకు బీసీలు బలి అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గత రెండు రోజుల్లో కనేకల్ మండలంలో జరిగిన సంఘటనలే ఇందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు. కనేకల్ మండలం గరుడచేడు గ్రామంలో మాజీ ఎంపీపీ రాజగోపాల్ రెడ్డి కురుబ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల భూ సర్వేలో జోక్యం చేసుకొని తన అనుచరునికి కొంత భూమిని కట్టబెట్టేందుకు ప్రయత్నం చేయడంతో బాధితుడు సురేష్ ఆత్మహత్య తనకు శరణ్యమని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కు పంపిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిందన్నారు. అదేవిధంగా జక్కల వాడికి గ్రామ సర్పంచ్ భర్త హనుమంత్ రెడ్డి భూమి ఆక్రమించేందుకు మహిళను కూడా చూడకుండా దౌర్జన్యానికి పాల్పడుతూ విచక్షణ రహితంగా దాడికి చేయడం జరిగిందన్నారు. జగనన్న భూహక్కు భూ రక్షణ రీసర్వే పేరుతో భూముల వాస్తవ హద్దులను అధికారులు మార్చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా వైసిపి నాయకులు కనుసన్నుల్లొ భూముల రి సర్వే జరుగుతుందని విమర్శించారు.

Advertisements

You may also like

Our Visitor

039478
Total views : 197028

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: