మూసీ వెంట ఉన్న ప్రాంతాల్లో అధికారుల సర్వేను స్థానికులు అడ్డుకుంటున్నారు. హైద్రాబాద్ నగరంలోని కొత్తపేట, చైతన్యపురి ప్రాంతాల్లోని మూసీ వెంట ఉన్న నిర్మించిన ఇళ్లను మార్కింగ్ చేసేందుకు అధికారులు రావడంతో స్థానికులు వారిని వెళ్లగొట్టారు. చైతన్యపురిలో ఓ బాధితుడు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి యత్నించారు. స్థానికులు ఆయనను అడ్డుకున్నారు. మూసీని ఆక్రమించి నిర్మించిన ఇళ్లను ఖాళీ చేయించి నగరంలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను బాధితులకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉన్నపళంగా ఇళ్లను కూల్చివేస్తాం.. ఖాళీ చేయాలని అంటే ఎలా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. బాధితులకు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మద్దతు పలికారు. చైతన్యపురిలో బాధితులతో కలిసి ఆయన ధర్నాకు దిగారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- హైదరాబాద్లోని గండిపేట భూకబ్జా యత్నం కేసులో దర్యాప్తు..నకిలీ జీఓలు, ఫోర్జరీ పత్రాలతో కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని విక్రయించేందుకు యత్నించిన అంతర్రాష్ట్ర భూ దందా ముఠాను పోలీసులు ఛేదించారు. పోలీసులకు తహసీల్దార్ ఫిర్యాదు చేయడంతో భూదందా గుట్టు వెలుగులోకి వచ్చింది. గండిపేట పరిధిలోని సర్వే నెంబర్ 18లో గల…
- హోంగార్డుపై కత్తితో దాడి చేసిన కేసులో నలుగురు అరెస్ట్..అనకాపల్లి జిల్లా పరవాడ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డ్ కె.వి. రమణపై కత్తితో దాడి చేసిన కేసులో నలుగురు నిందితులను పరవాడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.ఇటీవల అర్ధరాత్రి సమయంలో హోంగార్డ్ కె.వి. రమణపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో…
- నెల్లూరు జిల్లా గూడూరు మండలంలో ఒక మహిళపై అత్యాచారం..నెల్లూరు జిల్లా గూడూరు మండలం మనుబోలు జాతీయ రహదారిపై కాగితాలపూరు సర్కిల్ వద్ద ఒక మహిళపై అత్యాచారం జరిగింది. ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు మహిళపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తుంది . ఈ సంఘటన స్థానికంగా…
- నెల్లూరు జిల్లా సంగం మండలంలో భారీ ఈదురు గాలులు..నెల్లూరు జిల్లా సంగం మండలంలో భారీ ఈదురు గాలులు, వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. మర్రిపాడు, జంగాల కండ్రిక గ్రామాల్లో భారీ గాలుల వీచడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. తలుపురుపాడు, తరుణవాయి, కొరిమెర్ల, జంగాల కండ్రిక గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు విరిగి,…
- ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం మేడిశెట్టి వారి పాలెంలో తీవ్ర గాలి దుమారం ..ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం మేడిశెట్టి వారి పాలెం గ్రామ శివారులో ఆదివారం భారీ వర్షం, ఈదురుగాలులు తీవ్ర నష్టాన్ని కలిగించాయి . బలమైన గాలుల ధాటికి ఓ ఇంటి ముందు ఉన్న రేకుల షెడ్డు ఒక్కసారిగా గాల్లోకి ఎగిరిపోయింది. సుమారు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 90149