బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సోషల్ మీడియా ద్వారా పార్టీ శ్రేణుల్ని, సోషల్ మీడియా సైన్యాన్ని అప్రమత్తం చేశారు. స్కాంగ్రేస్ స్కామర్ల నుంచి రాబోయే కొద్ది రోజులలో అనేక తప్పుడు, డీప్ ఫేక్ వీడియోలు, ఇతర రకాల అసంబద్ధమైన ప్రచారాలు రావొచ్చని కేటీఆర్ హెచ్చరించారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అసత్య ప్రచారాల వలలో ఓటర్లు పడకుండా చూడాలని కేటీఆర్ కోరారు. డీప్ ఫేక్ కంటెంట్ గురించి దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. డీప్ ఫేక్ వ్యాప్తి కట్టడికి కేంద్రం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఈ తరుణంలో తెలంగాణ ఎన్నికల్లోనూ ఆ తరహా కంటెంట్ వైరల్ కావొచ్చంటూ కేటీఆర్ చేసిన కామెంట్లు ఇప్పుడు ఆసక్తిని రేకేత్తిస్తోన్నాయి.