Saturday, July 11, 2026
News Navigation
Saturday, July 11, 2026
News Navigation

Breaking

Saturday, July 11, 2026
Home Crime ఘోర రోడ్డు ప్రమాదం

ఘోర రోడ్డు ప్రమాదం

by Rama
bus accident

తమిళనాడు కుప్పం సరిహద్దు వాణియంబాడిలో చెన్నై-బెంగళూరు జాతీయ రహదారిపై ప్రభుత్వ బస్సు, ప్రైవేట్ బస్సు ఢీకొన్న ఘటనలో నలుగురు పురుషులు, ఒక మహిళ సహా 5 మంది మృతి చెందారు. 40 మందికి పైగా గాయపడ్డారు తిరుపత్తూరు జిల్లా చెన్నై-బెంగళూరు జాతీయ రహదారిపై వాణియంపాడి చెట్టి అప్పనూర్ జంక్షన్ ప్రాంతంలో బెంగళూరు నుంచి చెన్నై వెళ్తున్న ప్రభుత్వ బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి ఎదురుగా చెన్నై నుంచి బెంగళూరు వస్తున్న ప్రైవేట్ లగ్జరీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రభుత్వ బస్సు డ్రైవర్, ఉలుందూర్ పేటకు చెందిన ఎవుమ్మలై, వాణియంబాడికి చెందిన మహ్మద్ బైరోస్, చిత్తూరు ప్రాంతానికి చెందిన అజిత్ కుమార్, చెన్నైకి చెందిన కృతిక అనే మహిళ సహా ఐదుగురు మరణించారు. 40 మందికి పైగా తీవ్రంగా గాయపడగా, ఇరుగుపొరుగు వారు వెంటనే వారిని రక్షించి చికిత్స నిమిత్తం వాణియంబాడి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అలాగే వాణియంబాడి రూరల్ పోలీసులు ఘటనపై విచారణ చేపట్టి ప్రమాదానికి గురైన బస్సులను రోడ్డుపై నుంచి తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు.

Read Also..

Advertisements

You may also like

Our Visitor

039648
Total views : 199016

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: