Saturday, July 11, 2026
News Navigation
Saturday, July 11, 2026
News Navigation

Breaking

Saturday, July 11, 2026
Home National కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త

by Satya
Good news for central government employees

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు (Central Government Employees):

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డీఏను 4 శాతం పెంచుతూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఉద్యోగులు, పెన్షనర్లకు 4 శాతం డీఏను పెంచుతూ నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జనవరి 1, 2024 నుంచి ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్ వర్తిస్తాయి. లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ ఈ నెలాఖరులోగా వచ్చే అవకాశం ఉన్నందున కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ నిర్ణయం వెలువడింది.

కేంద్ర ప్రభుత్వం నిర్ణయం(Decision of Central Govt)..

కేంద్ర ప్రభుత్వం నిర్ణయం వల్ల 49లక్షల18వేల మంది ఉద్యోగులకు, 67లక్షల95 వేల మంది పెన్షనర్లకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. నిర్ణయం వల్ల ఖజానాకు ప్రతి ఏటా రూ.13 వేల కోట్ల భారం పడుతుందన్నారు. ఏడో వేతన సంఘం సిఫార్సుల మేరకు పెంపుదల ఉంటుందని తెలిపింది. కాగా, కేబినెట్ సమావేశంలో ఏఐ మిషన్‌కు కేంద్ర ప్రభుత్వం(Central Govt) 10వేల కోట్లు కేటాయించింది. ముడి జనపనారకు మద్దతు ధరను 285కు పెంచింది. ముడి జనపనారకు క్వింటాల్‌కు కనీస మద్దతు ధరను 5వేల335గా నిర్ధారించింది.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: జ‌మ్మూక‌శ్మీర్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్తున్న ప్ర‌ధాని మోదీ


గగన్‌యాన్ మిషన్‌లో కీలక మైలురాయి సాధించిన ఇస్రో.
భారత తొలి మానవ అంతరిక్ష యాత్ర గగన్‌యాన్ మిషన్‌లో ఇస్రో మరో కీలక విజయాన్ని నమోదు …
చెన్నై ఎగ్మూర్‌లోని ఆస్పత్రుల్లో సీఎం విజయ్‌ ఆకస్మిక తనిఖీలు.
తమిళనాడు సీఎం విజయ్ పాలనలో తన మార్క్‌ చూపిస్తున్నారు. అవినీతి లేని పాలన అందిస్తానని చెబుతున్న …
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై భారత్‌ ఆందోళన.
పశ్చిమాసియాలో తాజా ఉద్రిక్త పరిస్థితులపై భారత్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయ జలమార్గాల మీదుగా …

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

039605
Total views : 198688

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: