ఆడపిల్ల పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు ఎన్ని కష్టాలు పడుతుంటారో తెలిసిందే. అలాంటి తల్లిదండ్రులకు భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అందించే కల్యాణ లక్ష్మీ పథకాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ పథకాన్ని ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనసాగిస్తోంది. ఈ పథకం ద్వారా ఆడబిడ్డల పెళ్లికి ఒక లక్షా నూట పదహారు రూపాయలను ప్రభుత్వం వారికి అందిస్తోంది. ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ బడ్జెట్లో ఆడబిడ్డలకు శుభవార్త చెప్పింది. కల్యాణ లక్ష్మీకి నిధులు కేటాయించింది. ప్రభుత్వం కల్యాణ లక్ష్మీ నిధులను విడుదల చేసింది.కల్యాణ లక్ష్మీ లబ్దిదారులకు గుడ్ న్యూస్ దీంతో కొన్ని నెలలుగా పెండింగ్ లోనే ఉన్న కల్యాణ లక్ష్మీ లబ్దిదారుల దరఖాస్తులకు ఎట్టకేలకు మోక్షం లభించే ఛాన్స్ వచ్చింది. కల్యాణలక్ష్మీ స్కీమ్ లబ్దిదారులకు రాష్ట్ర ప్రభుత్వం 1225.43కోట్లు విడుదల చేసింది. ఈమధ్యే ప్రకటించిన బడ్జెట్ లో ఈ స్కీంకు ప్రభుత్వం 2 వేల 175 కోట్లను కేటాయించింది. అందులో నుంచి 24 వేల 38 కొత్త దరఖాస్తులతో పాటు పెండింగ్ లో ఉన్న దరఖాస్తులకు నిధులు విడుదల చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగి కర్టెన్ రైజర్ ఈవెంట్ శుక్రవారం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ రియాల్టీ షోలో తెలుగు లయన్స్, హిందీ హాక్స్, తమిళ్ టైగర్స్, మావెరిక్స్, కన్నడ పాంతర్స్…ఇలా ఐదు టీమ్స్ పాల్గొననున్నాయి. ఈ…
- చిలకా ప్రొడక్షన్స్ థ్రిల్లర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్గా మూవీ గ్రాండ్ రిలీజ్..నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సతీష్ కాసెట్టి తన కొత్త థ్రిల్లర్ మూవీ ‘మరీచిక’తో మరోసారి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యారు. వైవిధ్యమైన , ఆలోచింపజేసే కథలను చూపడంలో ప్రత్యేక గుర్తింపు పొందిన డైరెక్టర్ మరోసారి తనదైన శైలిలో ఈసారి కూడా…
- తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. SIR ప్రక్రియకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. జూన్ 25 నుంచి జులై 24 వరకు అధికారులు,…
- విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!విశాఖ జిల్లా మాడుగులలో వంట గ్యాస్ కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. డిజిటల్ భారత్ పేరుతో బుకింగ్ ప్రక్రియను సులభతరం చేశామని ప్రభుత్వం చెబుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం వినియోగదారులకు గ్యాస్ సరఫరా కావడంలేదు. మాడుగులలో గ్యాస్ బుక్ చేసిన వెంటనే వినియోగదారుల మొబైల్…
- తన పనితీరుతో ఆకట్టుకుంటున్న సీఎం విజయ్..తమిళనాట చారిత్రాత్మక విజయంతో రికార్డ్ సృష్టించిన సీఎం విజయ్..తనదైన పనితీరుతో ఆకట్టుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచే తన క్రమశిక్షణ, సమయపాలన అధికారుల్లో చర్చనీయాంశంగా మారాయి. ఓ సాధారణ ప్రభుత్వ ఉద్యోగిలా సచివాలయంలో విధులకు హాజరవుతుండటంపై హర్షం వ్యక్తం…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 78908