ఆడపిల్ల పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు ఎన్ని కష్టాలు పడుతుంటారో తెలిసిందే. అలాంటి తల్లిదండ్రులకు భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అందించే కల్యాణ లక్ష్మీ పథకాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ పథకాన్ని ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనసాగిస్తోంది. ఈ పథకం ద్వారా ఆడబిడ్డల పెళ్లికి ఒక లక్షా నూట పదహారు రూపాయలను ప్రభుత్వం వారికి అందిస్తోంది. ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ బడ్జెట్లో ఆడబిడ్డలకు శుభవార్త చెప్పింది. కల్యాణ లక్ష్మీకి నిధులు కేటాయించింది. ప్రభుత్వం కల్యాణ లక్ష్మీ నిధులను విడుదల చేసింది.కల్యాణ లక్ష్మీ లబ్దిదారులకు గుడ్ న్యూస్ దీంతో కొన్ని నెలలుగా పెండింగ్ లోనే ఉన్న కల్యాణ లక్ష్మీ లబ్దిదారుల దరఖాస్తులకు ఎట్టకేలకు మోక్షం లభించే ఛాన్స్ వచ్చింది. కల్యాణలక్ష్మీ స్కీమ్ లబ్దిదారులకు రాష్ట్ర ప్రభుత్వం 1225.43కోట్లు విడుదల చేసింది. ఈమధ్యే ప్రకటించిన బడ్జెట్ లో ఈ స్కీంకు ప్రభుత్వం 2 వేల 175 కోట్లను కేటాయించింది. అందులో నుంచి 24 వేల 38 కొత్త దరఖాస్తులతో పాటు పెండింగ్ లో ఉన్న దరఖాస్తులకు నిధులు విడుదల చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్పై ఇంగ్లండ్ ఘన విజయం.వావ్! హ్యారీ బ్రూక్ మరియు అతని జట్టు నుంచి ఇది నిజంగా అద్భుతమైన ప్రదర్శన. ఇన్నింగ్స్ మధ్యలో, బంతి పిచ్పై నెమ్మదిగా ఆగుతున్న పరిస్థితుల్లో భారత్కు పోరాడే అవకాశం ఉందా అన్న సందేహం కలిగింది. 159 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో…
- రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.రైతులు అన్నం పెట్టే దేవుళ్ళతో సమానం, వారిని ఇబ్బంది కలిగించకూడదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల మంత్రి ,జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, రెవెన్యూ అటవీ అధికారులతో సమావేశం నిర్వహించారు. సోమశిల…
- బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా సందర్శించారు. కేంద్రమంత్రితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు డీకే అరుణ, లక్ష్మణ్లు ఈ పర్యటనలో పాల్గొన్నారు.…
- యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ ప్రారంభోత్సవం.హైదరాబాద్లో ఒలింపిక్ క్రీడలు నిర్వహించాలనేది తన డ్రీమ్ అని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి అన్నారు. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ, గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్ను భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషతో కలిసి ఆయన ప్రారంభించారు.…
- ఇరాన్పై అదనపు దాడుల నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు.ఇరాన్పై అదనపు దాడులు ముమ్మరమైన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఇప్పటికే సైనికంగా విజయం సాధించామని, ప్రస్తుతం ఇరాన్ వద్ద చాలా తక్కువ వనరులు మాత్రమే మిగిలి ఉన్నాయని ఆయన ప్రకటించారు. అమెరికా చర్యలతో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి






Total views : 201056