కేరళలోని వయనాడ్ జిల్లాలో పలు ప్రాంతాలో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు సహా 19 మంది మరణించారు. వందలాది మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. వారిని కాపాడేందుకు ఘటనాస్థలంలో రెస్య్కూ టీమ్ సహాయక చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు ఐదు డెడ్ బాడీలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మెప్పాడి ముండకైలో ప్రాంతంలో రెండుసార్లు కొండచరియలు విరిగిపడ్డాయి. సమాచారం అందుకున్న వెంటనే కేరళ రాష్ట్ర విపత్తునిర్వహణ దళం, ఫైరింజన్లు స్పందించి ఘటనాస్థలానికి చేరుకున్నాయి. సమీపంలోని ప్రాంతాల నుంచి అదనపు రెస్య్కూ టీమ్ సైతం వయనాడ్ కు చేరుకుంన్నాయి. భారీ వర్షాలు కురుస్తుండటంతో సహాయక చర్యలకు అంతరాయం వాటిల్లుతోంది. అనేక ఇండ్లు ధ్వంసమయ్యాయి. కొండచరియల కింద చాలా మంది ప్రజలు చిక్కుకుని ఉంటారని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మెప్పాడి ముండకై ప్రాంతంలో ఇంత పెద్ద విపత్తును వయనాడ్ ఎన్నడూ చూడలేదని చెబుతున్నారు. ఈ ఘటనపై సీఎం పినరయి విజయన్ స్పందించారు. సంబంధిత ప్రభుత్వ సంస్థలు, ఇతరత్రా యంత్రాంగమంతా సహాయచర్యల్లో నిమగ్నమైనట్లు తెలిపారు .
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- గద్దర్ విగ్రహానికి భూమిపూజ నిర్వహణ.పీడిత దళిత అణగారిన కులాలకు గద్దర్ మాట పాట ఒక దిక్సూచి అని రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్ వెన్నెల గద్దర్ అన్నారు . మెదక్ జిల్లాలో పర్యటనలో భాగంగా శుక్రవారం నాడు ధ్యాన్ చంద్ చౌరస్తా వద్ద గద్దర్ విగ్రహ…
- సూర్య ‘విశ్వనాథ్ & సన్స్’ ట్రైలర్ విడుదల…సూర్య ‘విశ్వనాథ్ & సన్స్’ ట్రైలర్ విడుదల… హృదయాలను హత్తుకునే ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా భారీ అంచనాలు తమిళ స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా నటించిన ‘విశ్వనాథ్ & సన్స్’ చిత్రం ట్రైలర్ విడుదలైంది. తొలి ఫ్రేమ్ నుంచే ఆహ్లాదకరమైన, భావోద్వేగభరితమైన,…
- బీఆర్ఎస్పై చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు.తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం వేడెక్కింది. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్ రెడ్డి చేసే ప్రతి వ్యాఖ్యను వక్రీకరించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్లో…
- చేనేతకు అండగా ప్రభుత్వం : హోంమంత్రి అనిత.జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో నిర్వహించిన ‘నేతన్న సేవలో’ కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. చేనేత కార్మికుల నుంచి చీర కొనుగోలు చేసి వారి కష్టాన్ని అభినందించిన మంత్రి, చేనేత అనేది కేవలం వృత్తి మాత్రమే…
- ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం విజయ్ లేఖ.దేశంలో నదుల అనుసంధానంపై మరోసారి చర్చకు దారితీసే కీలక పరిణామం చోటుచేసుకుంది. గోదావరి–కావేరి–గుండార్ నదుల అనుసంధాన ప్రాజెక్టును అత్యంత ప్రాధాన్యంతో వేగవంతంగా అమలు చేయాలని కోరుతూ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. గోదావరిలో సముద్రంలో కలిసిపోతున్న…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి