కేరళలోని వయనాడ్ జిల్లాలో పలు ప్రాంతాలో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు సహా 19 మంది మరణించారు. వందలాది మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. వారిని కాపాడేందుకు ఘటనాస్థలంలో రెస్య్కూ టీమ్ సహాయక చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు ఐదు డెడ్ బాడీలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మెప్పాడి ముండకైలో ప్రాంతంలో రెండుసార్లు కొండచరియలు విరిగిపడ్డాయి. సమాచారం అందుకున్న వెంటనే కేరళ రాష్ట్ర విపత్తునిర్వహణ దళం, ఫైరింజన్లు స్పందించి ఘటనాస్థలానికి చేరుకున్నాయి. సమీపంలోని ప్రాంతాల నుంచి అదనపు రెస్య్కూ టీమ్ సైతం వయనాడ్ కు చేరుకుంన్నాయి. భారీ వర్షాలు కురుస్తుండటంతో సహాయక చర్యలకు అంతరాయం వాటిల్లుతోంది. అనేక ఇండ్లు ధ్వంసమయ్యాయి. కొండచరియల కింద చాలా మంది ప్రజలు చిక్కుకుని ఉంటారని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మెప్పాడి ముండకై ప్రాంతంలో ఇంత పెద్ద విపత్తును వయనాడ్ ఎన్నడూ చూడలేదని చెబుతున్నారు. ఈ ఘటనపై సీఎం పినరయి విజయన్ స్పందించారు. సంబంధిత ప్రభుత్వ సంస్థలు, ఇతరత్రా యంత్రాంగమంతా సహాయచర్యల్లో నిమగ్నమైనట్లు తెలిపారు .
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- నంద్యాల జిల్లా రుద్రవరంలో చమురు నిక్షేపాల అన్వేషణ.నంద్యాల జిల్లా రుద్రవరం మండలంలో పెట్రోల్, డీజల్ నిక్షేపాల అన్వేషణ కలకలం రేపుతోంది. మండలంలోని పలు గ్రామాల్లో చమురు నిల్వలను గుర్తించేందుకు భారీ స్థాయిలో బోరు తవ్వకాలు ప్రారంభమయ్యాయి. శాటిలైట్ ద్వారా గుర్తించిన పాయింట్ల ఆధారంగా సుమారు 50 బోరు బావుల…
- రాబర్ట్ వాద్రాకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఊరట..ప్రముఖ వ్యాపారవేత్త, కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకాగాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు భారీ ఊరట లభించింది. హర్యానాలోని గురుగ్రామ్ భూ కుంభకోణం, మనీలాండరింగ్ కేసులో ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఆయనకు ఉపశమనం కలిగింది. ఇవాళ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరైన ఆయనకు ప్రత్యేక…
- నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం..నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఊట్లపల్లి శివారులో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు బోరు గుంతలో పడిపోయిన నాలుగేళ్ల చిన్నారిని కాపాడేందుకు వెళ్లిన తాత ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. గ్రామ శివారులోని వ్యవసాయ పొలం వద్ద ఆడుకుంటున్న…
- మహారాష్ట్రలోని పుణెలో నకిలీ బాంబు కలకలం..మహారాష్ట్రలోని పుణెలో ఓ యువకుడు చేసిన నకిలీ బాంబు కలకలం వెయ్యిమంది పోలీసులను పరుగులు పెట్టించింది. సోలాపూర్కు చెందిన శివాజీ రాథోడ్ అనే యువకుడు తన వైద్యానికి 7 లక్షల రూపాయలు సమీకరించాలనే ఉద్దేశంతో ఈ డ్రామాకు తెరలేపాడు. హడప్సర్లోని కామధేను…
- బంగారం దిగుమతులను తగ్గించేందుకు కొత్త వ్యూహం..దేశ ఆర్థిక వ్యవస్థను మలుపు తిప్పే ఒక అతిపెద్ద సంచలనానికి మోదీ సర్కార్ సిద్ధమవుతోందా? మీ ఇంట్లో.. అల్మారాల్లో.. లాకర్లలో పేరుకుపోతున్న బంగారం, ఇప్పుడు దేశానికి ఆర్థిక ఆయుధంగా మారబోతోందా..? అసలు ఏంటి ఈ గోల్డ్ మానిటైజేషన్ మాస్టర్ ప్లాన్? సామాన్యుడికి…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 78491