Thursday, May 14, 2026
News Navigation
Thursday, May 14, 2026
News Navigation

Breaking

Thursday, May 14, 2026
Home International శ్రీలంక క్రికెట్ బోర్డుపై నిషేధాన్ని ఎత్తివేసిన ఐసీసీ

శ్రీలంక క్రికెట్ బోర్డుపై నిషేధాన్ని ఎత్తివేసిన ఐసీసీ

by Satya
nternational Cricket Council ICC

శ్రీలంక క్రికెట్ బోర్డుపై గతంలో విధించిన నిషేధాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ తాజాగా ఎత్తివేసింది. క్రికెట్ పాలన వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం నిబంధనలకు విరుద్ధమంటూ గతేడాది నవంబరులో శ్రీలంక క్రికెట్ బోర్డుపై ఐసీసీ నిషేధం విధించింది. వరల్డ్ కప్ లో టీమిండియా చేతిలో శ్రీలంక జట్టు ఘోర పరాజయం నేపథ్యంలో, లంక క్రికెట్ బోర్డును శ్రీలంక క్రీడల మంత్రి రద్దు చేశారు. అయితే, ప్రభుత్వం క్రికెట్ బోర్డు కార్యకలాపాల్లో జోక్యం చేసుకోవడం ఐసీసీ రాజ్యాంగానికి విరుద్ధం. ఈ కారణంగానే శ్రీలంక క్రికెట్ బోర్డుపై ఐసీసీ నిషేధం విధించింది. దాంతో, శ్రీలంకలో నిర్వహించాల్సిన అండర్-19 వరల్డ్ కప్ కూడా దక్షిణాఫ్రికా తరలిపోయింది.

Advertisements

You may also like

Our Visitor

012500
Total views : 75245

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.