కందుకూరు మండలంలో ప్రకృతి సహజ సిద్ధంగా ఉన్న వాగులు,కుంటలు,గుట్టలు అక్రమార్కుల పాలు అవుతున్నాయి .వాగులల్లో ఉన్న మట్టిని,అసైన్డ్ మెంట్,లావాణి పట్టా భూములలో ఉన్న మట్టిని అక్రమార్కులు రాత్రి పగలు అనే తేడా లేకుండా విచ్చలవిడిగా పాతాళంలోకి గుంతలు తొవ్వుతున్నారు. అక్రమార్కులు ప్రాంతాలలో ప్రకృతి సహజ సిద్ధంగా మట్టితో ఇసుక తయారీ చేసి లక్షలు దండుకుంటున్నారు. అక్రమార్కుల తీరు చూస్తుంటే తోవ్వుకో అమ్ముకో అడిగేవారు లేరు అన్నట్టు ఉంది. నిర్మానుష్య ప్రాంతాలలో ఇసుక ఫిల్టర్ పెట్టి గుట్టుచప్పుడు కాకుండా మట్టిని జల్లెడ పట్టి ఇసుకను తయారు చేస్తున్నారు.
దీనికి నిదర్శనం కందుకూరు మండలంలోని రాచులూరు గ్రామ రెవిన్యూ పరిధిలోని సర్వే నంబర్ 111లో(ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు వాగు ప్రక్కన) గుట్టుచప్పుడు కాకుండా ఫిల్టర్ ఇసుక దందా…!మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందంగా నడుస్తుంది.అటువైపు రెవిన్యూ,ఇరిగేషన్,పోలీస్ శాఖ అధికారులు కన్నెత్తి చూడడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే మట్టి త్రవ్వకాలు జరిపి ఫిల్టర్ ఇసుక తయారీ చేస్తున్నారు.
వాల్టా చట్టానికి తూట్లు పెడుతున్నారు.రెవిన్యూ,ఇరిగేషన్ శాఖ అధికారులు నిద్ర మత్తులో మునిగిపోతున్నారు అనే విమర్శలు వస్తున్నాయి.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- 13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం గత పదమూడు సంవత్సరాలుగా సాగుతుండటం స్థానిక ప్రజలకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తోంది. 2014లో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ ఇప్పటికీ పూర్తి కాకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. ప్రతిరోజూ రైల్వే గేటు…
- ‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ షూటింగ్ మొత్తం పూర్తయింది. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్పై వెంకట సతీష్ కిలారు భారీ స్థాయిలో…
- పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..కార్మికులు, కర్షకులే దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని హోంమంత్రి అనిత తెలిపారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో అనిత పర్యటించారు. కోటవురట్ల మండలం రామచంద్రపురం గ్రామానికి చేరుకున్న మంత్రికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. రామచంద్రపురం గ్రామంలో ఇంటింటికీ వెళ్లి…
- మత్స్యపురిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు…పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. వీరవాసరం మండలం మత్స్యపురి గ్రామంలో గ్రామకంఠం భూమిని ఆక్రమించి నిర్మించిన ఇళ్లను కోర్టు ఆదేశాల మేరకు కూల్చివేశారు. భారీ బందోబస్తుతో పోలీసు, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా ఈ…
- అల్లూరి జిల్లాలో రోడ్లు లేని గిరిజన గ్రామాలు…అల్లూరి జిల్లా అరకు నియోజకవర్గంలోని గిరిజన ప్రాంతాల్లో రహదారి సమస్యలు ప్రజల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. అరకు, డుంబ్రిగూడ, అనంతగిరి మండలాల్లోని పలు గ్రామాలు ఇప్పటికీ కనీస రహదారి సౌకర్యం లేకుండా ఉన్నాయి. మాడగడ పంచాయతీ పరిధిలోని మెచ్చగూడ గ్రామస్తులు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 62311