Saturday, July 11, 2026
News Navigation
Saturday, July 11, 2026
News Navigation

Breaking

Saturday, July 11, 2026
Home Andhra Pradesh టిడిపి నుండి వైయస్సార్సీపి పార్టీలోకి చేరిక..

టిడిపి నుండి వైయస్సార్సీపి పార్టీలోకి చేరిక..

by Rama
TDP to YCP

అనంతపురం జిల్లా పామిడి పట్టణం మరియు గ్రామీణ ప్రాంతాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వము అందిస్తున్న సంక్షేమ పథకాలను, ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి మాట అమలు చేయడంతో ఆకర్షితులై గత 40 సంవత్సరాలుగా టిడిపి పార్టీలో ఉంటున్న సుమారు 100 కుటుంబాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు ఎమ్మెల్యే వై వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పామిడి పట్టణంలోని 4,5,9,18,19 వార్డులందు పామిడి స్టేషన్ మరియు కొత్తపల్లికి చెందిన వంద టీడీపీ కుటుంబాలు గుంతకల్లు ఎమ్మెల్యే వై వెంకట్రామిరెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా వారందరికీ గుంతకల్లు ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా టిడిపి పార్టీలో ఉంటూ పార్టీకి ఊడిగం చేశామని కానీ మమ్మల్ని పార్టీ పట్టించుకోలేదన్నారు. దీంతో ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి ప్రభుత్వ అందిస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు తెలిపారు.

Advertisements

You may also like

Our Visitor

039667
Total views : 199101

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: