రాజకీయ నాయకులు విదేశీ పర్యటనలు తరచుగా చేస్తూ ఉంటారు. ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి కూడా ఐదేళ్లలో నాలుగు ఐదు సార్లు ఏదో ఒక కార్యక్రమం పేరుతో అమెరికా వెళ్ళొస్తుంటారు. ఇక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులైతే చెప్పనక్కర్లేదు. కానీ కేసీఆర్ వీటన్నింటికీ వ్యతిరేకం .దేశంలోనే అత్యంత తక్కువ విదేశీ పర్యటనలు చేసిన ముఖ్యమంత్రి. రెండుసార్లు అధికారాన్ని చేపట్టిన ఆయన పర్యటించిన దేశాలు రెండు మాత్రమే. ఒకటి ముఖ్యమంత్రి అయిన కొత్తలో సింగపూర్ పర్యటించారు. రెండు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించేందుకు చైనా పర్యటన చేశారు.ఇవి కాకుండా ఆయన జీవితకాలంలో ఎప్పుడు దేశాన్ని దాటలేదు.
కానీ ఇప్పుడు కేసీఆర్ అమెరికా వెళ్ళబోతున్నారు . ఒకటి రెండు నెలల్లో ఆయన అమెరికా ప్రయాణం. కొన్ని రోజులుగా కేసీఆర్ సైలెంట్ గా ఉంటున్నారు. మొదట్లో అనారోగ్య కారణాలు, ఆ తర్వాత ఫామ్ హౌస్ లోనే రాజకీయ సమావేశాలు ఏర్పాటు చేసుకొని అక్కడికే పరిమితమయ్యారు. ఇప్పుడు అమెరికా వెళ్లి నెల రెండు నెలలు ఉండే అవకాశం కన్పిస్తుంది . ఇప్పటికే కేసీఆర్ మనవడు హిమాన్షు అమెరికాలో చదువుకుంటున్నాడు . మనవడి కోరిక మేరకే తాత కేసీఆర్ అమెరికా వెళుతున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజులు అక్కడే రెస్ట్ తీసుకోవాలని ఈ మధ్యకాలంలో ఇండియా వచ్చిన హిమాన్షు కోరినట్లు సమాచారం. కేసీఆర్ అమెరికా షెడ్యూల్ ని రెడీ చేస్తున్నారు బీ ఆర్ ఎస్ నాయకులు .
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- కడప జిల్లా పులివెందులలో నీటి సమస్యలపై బి.టెక్ రవి విమర్శలు..కడప జిల్లా పులివెందులలో రాజకీయ హీట్ పెరుగుతోంది.ఇద్దరు ముఖ్యమంత్రులను అందించిన ఈ నియోజకవర్గంలో ఇప్పటికీ తాగునీటి సమస్యలు కొనసాగుతున్నాయని టీడీపీ ఇంచార్జి బి.టెక్ రవి విమర్శించారు.ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా పులివెందుల పట్టణంలోని క్రిస్టియన్ వీధిలో పెన్షన్లు ఆయన…
- అమెరికాలో తెలుగు యువకుడు ఆత్మహత్య..ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం పెద్ద సంఖ్యలో అమెరికాకు వెళ్తున్నారు తెలుగు రాష్ట్రాలకు చెందిన యువత. ఐతే అక్కడ ఉద్యోగాల్లో స్థిరపడిన వాళ్లు కొందరైతే..మరికొంత మంది సరైన ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు..ఈ నేపథ్యంలోనే…
- కలగానే మిగిలిన సొంతింటి కల..పార్వతీపురం మన్యం జిల్లాలోని పార్వతీపురం, సాలూరు నియోజకవర్గాల్లో పేదల సొంతింటి కల ఇంకా అటకెక్కే ఉంది. గత ప్రభుత్వ హయాంలో పార్వతీపురం మండలం అడ్డాపుశిల, సాలూరు మున్సిపాలిటీ పరిధిలో భారీ ఎత్తున టిడ్కో ఇళ్లను నిర్మించారు. మొత్తం 1,983 మంది లబ్ధిదారులకు…
- భారీగా పెరిగిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర..కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరిగింది. 19 కేజీల కమర్షియల్ సిలిండర్పై చమురు మార్కెటింగ్ సంస్థలు ఏకంగా రూ.993 మేర పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ఈ ధరలు ఇవాల్టి నుంచే అమల్లోకి వచ్చాయి. అయితే, గృహ వినియోగదారులకు ఊరట…
- గ్లోబల్ బిజినెస్ హబ్గా తెలంగాణ..2027 మార్చి 31 నాటికి వ్యాపారాల అభివృద్ధి, విద్యార్థులకు అంతర్జాతీయ అవకాశాలు కల్పించడమే లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. ఎక్స్ప్లోర్ టు ఎక్స్పాండ్ అనే అంతర్జాతీయ వేదిక లోగోను అధికారికంగా ఆవిష్కరించారు . ఈ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 61766