Thursday, September 10, 2026
News Navigation
Thursday, September 10, 2026
News Navigation

Breaking

Thursday, September 10, 2026
Home Andhra Pradesh న్యాయవాదుల నిరసన ర్యాలీ…..

న్యాయవాదుల నిరసన ర్యాలీ…..

by Prakash
Lawyers protest rally

బద్వేల్ పట్టణంలో ఏపీ టైటిలింగ్ ల్యాండ్ యాక్టును ఉపసంహరించు కోవాలంటూ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక న్యాయవాదులు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సి వి ఎన్ ప్రసాద్, సీనియర్ న్యాయవాది దేవి రెడ్డి బ్రహ్మ రెడ్డి మాట్లాడుతూ…. ఈ ప్రభుత్వం న్యాయవ్యవస్థకు సంబంధించిన విధులను తగ్గిస్తూ న్యాయవ్యవస్థ ను నిర్వీర్యం చేస్తోందని, న్యాయస్థానాలు చేయాల్సిన అధికారాలను రెవిన్యూ వ్యవస్థకు కట్టబెట్టడం దారుణమని తెలిపారు. భూ సమస్యలు, సెక్షన్ 8 ప్రకారం న్యాయస్థానాల పరిధిలో లేకుండా, సిపిసి అండ్ ఎవిడెన్స్ యాక్ట్ లేకుండా, భూ సమస్యలు పరిష్కారం కావని అన్నారు. ఏపీ టైటిలింగ్ 2022 యాక్ట్ ఈ ప్రభుత్వం రద్దు చేయకపోతే భవిష్యత్తులో భూ సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని, కావున ప్రభుత్వం వెంటనే ఈ జీవోను ఉపసంహరించుకోవాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రదీప్ కుమార్, రాజేశ్వరరావు, ఈసీ ఓబుల్ రెడ్డి, డివిఎస్సార్ కృష్ణ, రమణ రెడ్డి, తదితర న్యాయ వాదులు పాల్గొన్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: