Friday, September 11, 2026
News Navigation
Friday, September 11, 2026
News Navigation

Breaking

Friday, September 11, 2026
Home TelanganaRangareddy ఈసీ వాగులో యదేచ్చగా ఇసుక దందా.. నిద్రమత్తులో అధికారులు..

ఈసీ వాగులో యదేచ్చగా ఇసుక దందా.. నిద్రమత్తులో అధికారులు..

by Rama
Sand

రంగారెడ్డి (Rangareddy) జిల్లా షాబాద్ మండల పరిధిలోని ఈసీ వాగు (EC River)లో యదేచ్చగా ఇసుకాసురులు ఇసుక దందులు నిర్వహిస్తున్నారు. ఈసీ నదిలో నుంచి తీసినా ఇసుకను పక్కనే డంపింగ్ చేసి ఎదేచ్ఛగా అమ్మేస్తున్నారు. అధికారులు మాత్రం చూసి చూడనట్టు ఉండిపోతున్నారు. అధికారులు తెలిసి ఇలా చేస్తున్నారా? తెలియక చేస్తున్నారా? ప్రజలకు అర్థం కావడం లేదు. ఇప్పటికే వర్షాలు సకాలంలో కురవక వాన నీరు లేక భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటి పోతున్న తరుణంలో వాగులో వచ్చిన ఇసుకను పక్కనే డంపింగ్ చేసుకొని అమ్ముతున్నారు.

ఇదేమిటని అడిగే నాధుడు లేకుండా పోయాడు. ఒకప్పుడు ఈసీ నదిలో ఎక్కువ మొత్తంలో ఇసుక ఉండటంతో నదిలో ఉన్న ఇసుకను తీసి ఊట బావిగా ఏర్పరిచి మోటార్ల ద్వారా పంటలు సాగు చేసేవారు. అలాగే చుట్టుపక్కల ఉన్న బోరు బావులు లలో పుష్కలంగా నీరు ఉండేది. అలాగే నది పరివాహక ప్రాంతంలో బోరు బావులలో పుష్కలంగా నీరు ఉండేది కానీ ఇసుక తీసివేయడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయి బోరు బావులు కూడా ఎండిపోతున్నాయి. దీని అరికట్టే నాథుడే లేడా అని ప్రజలు వాపోతున్నారు. వెంటనే ఇస్కాసురులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు..

ఇది చదవండి: గొట్టిపాటి లక్ష్మి భారీ బహిరంగ సభ..


ఆయుష్ విద్యార్థులకు తెలంగాణ సర్కార్ తీపికబురు.
తెలంగాణలో ఆయుష్ వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఆయుర్వేద, హోమియోపతి, …
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం.
తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, ఈ విజయాన్ని ఏ శక్తీ ఆపలేదని …
తెలంగాణ రైజింగ్‌ సమ్మిట్‌కు ఫిలిప్పీన్స్ కార్యదర్శికి ఆహ్వానం.
తెలంగాణను ప్రపంచ పెట్టుబడులు, వ్యవసాయ వాణిజ్యం, పారిశ్రామిక అవకాశాలకు ప్రధాన గమ్యస్థానంగా నిలిపే లక్ష్యంతో 2026 …

Follow us on : Google News మరిన్నితాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: