Tuesday, April 28, 2026
News Navigation
Tuesday, April 28, 2026
News Navigation

Breaking

Tuesday, April 28, 2026
Home TelanganaKarimnagar రెండు ప్రాణాలు తీసిన భూమి వివాదం..

రెండు ప్రాణాలు తీసిన భూమి వివాదం..

by Rama
murder

జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం కమలాపూర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. రెండు కుటుంబాల మధ్య ఉన్న భూమి వివాదంతో ఒకరి ఆత్మహత్య (Suicide) కు పాల్పడగా మరొకరి హత్య(Murder)కు దారి తీసింది. మంగళవారం రాత్రి జరిగిన ఈ సంఘటన స్థానికంగా సంచలనంగా మారింది. గ్రామానికి చెందిన పులి రేణ(43) అనే వివాహిత ఉరి వేసుకుని అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకుంది. ఇంటికి వచ్చిన ఆమె భర్త పులి గంగయ్య భార్య మృతిని తట్టుకోలేక ఆమె మరణానికి పక్కింటి పులి పద్మ నే కారణమని భావించి కళ్ల్లు తీసే కత్తి తో దాడికి పాల్పడగా పద్మ సంఘటన స్థలంలోనే చనిపోయింది. అయితే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న రేణ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు స్థానికుల ద్వారా తెలియ వచ్చింది. మరోవైపు ఈ రెండు కుటుంబాల మధ్య భూ సంబంధమైన వివాదాలు గత కొన్ని ఏళ్లు గా ఉన్నట్లు తెలుస్తుంది. హత్యకు పాల్పడిన గంగయ్య ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. మంగళవారం రాత్రి సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

ఇది చదవండి: తెలంగాణలో 18 జిల్లాలు ఔట్?


రిజిస్ట్రేషన్లు తగ్గినా…తెలంగాణకు భారీ ఆదాయం..
తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగంలో ప్రస్తుతం విభిన్న దృశ్యం కనిపిస్తోంది. ఒకవైపు ఆస్తుల రిజిస్ట్రేషన్ల సంఖ్య …
ప్రజల ప్రాణాలకు ముప్పుగా జవహర్ నగర్ డంపింగ్ యార్డ్
జిహెచ్ఎంసి పరిధిలోని మొత్తం చెత్తను జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ కే తరలిస్తున్నారు . దింతో …
మెదక్ హైవేపై కాలిబూడిదైన ప్రైవేట్ బస్సు..
మెదక్ జిల్లాలో NH 44పై ఘోర అగ్నిప్రమాదం జరిగిది. మాసాయిపేట వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ …

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

008615
Total views : 56956

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.