Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Andhra Pradesh గన్నవరంలో అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే..

గన్నవరంలో అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే..

by Prakash
vallabaneni vamshi mla

కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం గన్నవరం మండలం కొత్తగూడెంలో పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. వల్లభనేని అరుణ చారిటబుల్ ట్రస్టు ద్వారా 5లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన ఆర్వో ప్లాంట్ ను వంశీ ప్రారంభించారు. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాట్లాడుతూ ఏ రాజకీయ నాయకుడైన ప్రజలకు మంచి చేసేందుకు పని చేయాలి. అధికారంలో ఉండగా చేయలేని పనులు వేరే వారిని చూసి అంతకు మించి చేస్తానంటే ప్రజలు నమ్మరు. ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్ మెంట్ ద్వారా లక్షల మంది పేద కుటుంబాలలో వెలుగులు రాజశేఖర్ రెడ్డి నింపారు. అదే బాటలో సీఎం జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థ ద్వారా పేదల ఆత్మగౌరవాన్ని పెంచాడు. వృద్ధులు, వికలాంగులు ఏనాయకుడు వద్ద పడిగాపులు పడకుండా 1వ తేదీన ఇంటివద్దనే ఫెంక్షన్ అందిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి నాలుగున్నర ఏళ్ళు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి హామీని అమలు చేస్తున్నాడు. ఎన్ని ఇబ్బందులు వచ్చిన ఒక్క సంక్షేమ పధకం కూడా ఆపలేదు. పేదలకు సంక్షేమ పథకాలు అమలులో కొన్ని అప్పులు చేయడం సహజం. గత ప్రభుత్వాలు అప్పులు చేయకుండా జేబులో డబ్బులు ఖర్చు చేశారా????? పేదలకు మంచి చేస్తుంటే కొంతమంది పప్పు బెల్లాలు లాగా పెడుతున్నారు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి పెత్తందారీ విధానాన్ని మార్చడం షావుకారులకు కడుపు మంటగా ఉంది. కొన్ని పత్రికలు, టీవీ చానల్స్ ద్వారా రాష్ట్రాన్ని అప్పులుపాలు చేస్తున్నారని అసత్య ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో పేద ప్రజలకు ఎక్కడా కష్టం రాలేదు. కష్టం వచ్చింది కేవలం చంద్రబాబుకి మాత్రమే. ధనికులు పిల్లలు కార్పొరేట్ పాఠశాలల్లో చదివితే ఇంగ్లీష్ అర్ధం అవుతుంది. పేదల పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివితే అర్ధం కాదని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. గత టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబుని నమ్మి రైతు, డ్వాక్రా రుణమాఫీ చేస్తామని గ్రామాల్లో చెప్పి చేయలేని పరిస్థితి. రాష్ట్రానికి సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఉంటే పేద ప్రజలకు మంచి జరుగుతుంది.

Advertisements

You may also like

Our Visitor

039487
Total views : 197121

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: