తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా కాంగ్రెస్ రెండో జాబితా ఖరారుకు సంబంధించి పార్టీ ముఖ్య నేతలో స్క్రీనింగ్ కమిటీ సమావేశం శనివారం సాయంత్రం ప్రారంభమైంది. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరుగుతోంది.ఈ సమావేశానికి స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్కుమార్రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ భేటీ తర్వాత తెలంగాణ కాంగ్రెస్ రెండో జాబితా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. రెండో జాబితాను అతి త్వరగా విడుదల చేయాలని చూస్తోంది. ఈ సమావేశంలో అభ్యర్థులను దాదాపు ఖరారు చేసే అవకాశం ఉంది.
National
శాసనసభ ఎన్నికల తనిఖీల్లో భాగంగా పట్టుబడిన నగదు, మద్యం, ఆభరణాలు, కానుకల విలువ మొత్తం రూ.300 కోట్ల మార్క్ దాటింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన అక్టోబరు 9న నుంచి ఇప్పటి వరకు తనిఖీల్లో పట్టుబడిన సొత్తు విలువ రూ.307.2కోట్లకు పైగా ఉన్నట్టు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ప్రకటించారు. గడచిన 24గంటల్లో రూ.9.69కోట్ల నగదు పట్టుబడగా, ఇప్పటి వరకు పట్టుబడిన మొత్తం నగదు రూ.105.58 కోట్లు అని వెల్లడించారు. రూ.1.35లక్షల విలువైన మద్యం పట్టుబడిందని తెలిపారు. స్వాధీనం చేసుకున్న మొత్తం సరకు విలువ రూ.13.58 కోట్లు అని తెలిపారు. 24 గంటల్లో రూ.72 లక్షల విలువైన 232 కిలోల గంజాయి పట్టుబడిందని తెలిపారు. గడచిన 24గంటల్లో రూ.3.81 కోట్ల విలువైన బంగారం, 894 కిలోల వెండి, 190 క్యారెట్ల వజ్రాలు, 5గ్రాముల ప్లాటినం స్వాధీనం చేసుకున్నామన్నారు. వాటి విలువ రూ.145.67 కోట్లు. వీటితో పాటు రూ.26.93 కోట్ల విలువైన ఇతర కానుకలు పట్టుబడ్డాయని తెలిపారు.
రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. గెలుపు గుర్రాల కోసం ప్రధాన రాజకీయ పార్టీలు ముమ్మర కసరత్తులు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే అధికార కాంగ్రెస్ పార్టీ శనివారం అభ్యర్థుల తొలి జాబితా ను విడుదల చేయగా.. అటు బీజేపీ కూడా 83 మందితో రెండో జాబితాను ప్రకటించింది.రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడంపై గత కొంతకాలంగా సందిగ్ధత నెలకొన్న విషయం తెలిసిందే. ఆ ఊహాగానాలకు తెరదించుతూ నేడు వెల్లడించిన జాబితాలో రాజే పేరును భాజపా ప్రకటించింది. తన కంచుకోట ఝల్రాపటన్ నుంచే ఆమెను బరిలోకి దించింది. ఈ నియోజకవర్గం నుంచి ఆమె ఇప్పటికే 4 సార్లు విజయం సాధించారు.ఇక, మేవాఢ్ వీరుడు మహారాణా ప్రతాప్ సింగ్ వారసుడు విశ్వరాజ్ సింగ్ మేవాఢ్ను నాథ్ద్వారా నుంచి నిలబెట్టింది. ఇటీవలే విశ్వరాజ్ భాజపాలో చేరారు. అటు ప్రముఖ రాజకీయ నేత భైరాన్ సింగ్ షెఖావత్ అల్లుడు నర్పత్ సింగ్ రజ్వీకు కూడా తాజా జాబితాలో చోటు దక్కింది. బీజేపీఇప్పటివరకు 124 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. అటు కాంగ్రెస్ కూడా శనివారం 33 మందితో అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. అయితే, ఇందులో పెద్దగా ఎలాంటి మార్పులు చేయలేదు.
ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశాం ముగిసిందని, తెలంగాణ కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ మానిక్ రావు థాక్రే తెలిపారు. అభ్యర్థల గురించి చర్చ జరిగిందిని తెలంగాణ కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ మానిక్ రావు థాక్రే తెలిపారు. అయితె అభ్యర్థులపై ఇంకో సమావేశాం జరిగే అవకాశం ఉందని థాక్రే అన్నారు. రెండవ జాబితాలో మిగతా అన్ని స్థానాల అభ్యర్ధులను ఖరారు చేయాలని అనుకుంటున్నామని, తదుపరి కాంగ్రెస్ సీఈసీకి జాబితా పంపిస్తామన్నారు. అవసరమైతే స్ర్కినింగ్ కమిటీ భేటీ అయ్యి…స్ర్కీనింగ్ కమిటీ చైర్మన్ నిర్ణయం తీసుకుంటారని మానిక్ రావు థాక్రే అన్నారు. వీలైనంత త్వరలో సీఈసీ మీటింగ్ ఉంటుందని, కమ్యూనిస్టు పార్గీలతో చర్చలు కొనసాగుతున్నాయి అన్నారు. కాంగ్రెస్ అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యత, ప్రాతినిధ్యం ఇచ్చేందుకు ప్రయత్నిస్తోందని థాక్రే అన్నారు.
గగన్యాన్.. టీవీ-డీ1 పరీక్ష విజయవంతం పై ప్రధాని మోదీ స్పందించారు. భారత మొట్టమొదటి మానవసహిత అంతరిక్ష మిషన్ ‘గగన్యాన్’ సాకారం దిశగా ఈ ప్రయోగం మనల్ని మరింత చేరువ చేసిందన్నారు. ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. తొలుత టీవీ-డీ1 ప్రయోగాన్ని ఉదయం 8 గంటలకే చేపట్టేందుకు ఇస్రో యత్నించింది. అయితే, సాంకేతిక లోపం తలెత్తడంతో చివరి నిమిషంలో ప్రయోగాన్ని నిలిపివేసింది. అనంతరం శాస్త్రవేత్తలు ఆ లోపాన్ని గుర్తించి సరిచేశారు. ఉదయం 10 గంటలకు రెండోసారి ప్రయత్నించి.. ఈ పరీక్షను విజయవంతంగా నిర్వహించినట్లు ఇస్రో వెల్లడించింది.




Total views : 194044