Sunday, June 21, 2026
News Navigation
Sunday, June 21, 2026
News Navigation

Breaking

Sunday, June 21, 2026
Home National రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ..

రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ..

by Rama
Vasundhara Raje

రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. గెలుపు గుర్రాల కోసం ప్రధాన రాజకీయ పార్టీలు ముమ్మర కసరత్తులు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే అధికార కాంగ్రెస్‌ పార్టీ శనివారం అభ్యర్థుల తొలి జాబితా ను విడుదల చేయగా.. అటు బీజేపీ కూడా 83 మందితో రెండో జాబితాను ప్రకటించింది.రాజస్థాన్‌ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడంపై గత కొంతకాలంగా సందిగ్ధత నెలకొన్న విషయం తెలిసిందే. ఆ ఊహాగానాలకు తెరదించుతూ నేడు వెల్లడించిన జాబితాలో రాజే పేరును భాజపా ప్రకటించింది. తన కంచుకోట ఝల్రాపటన్‌ నుంచే ఆమెను బరిలోకి దించింది. ఈ నియోజకవర్గం నుంచి ఆమె ఇప్పటికే 4 సార్లు విజయం సాధించారు.ఇక, మేవాఢ్‌ వీరుడు మహారాణా ప్రతాప్‌ సింగ్‌ వారసుడు విశ్వరాజ్‌ సింగ్‌ మేవాఢ్‌ను నాథ్‌ద్వారా నుంచి నిలబెట్టింది. ఇటీవలే విశ్వరాజ్‌ భాజపాలో చేరారు. అటు ప్రముఖ రాజకీయ నేత భైరాన్‌ సింగ్ షెఖావత్‌ అల్లుడు నర్పత్‌ సింగ్‌ రజ్వీకు కూడా తాజా జాబితాలో చోటు దక్కింది. బీజేపీఇప్పటివరకు 124 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. అటు కాంగ్రెస్‌ కూడా శనివారం 33 మందితో అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. అయితే, ఇందులో పెద్దగా ఎలాంటి మార్పులు చేయలేదు.

Advertisements

You may also like

Our Visitor

027610
Total views : 152670

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.