భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని నేడు జరుగుతున్న శాసనసభ ఎన్నికలకు జిల్లా లోని ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన ప్రక్రియ కు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేసే సమయంలో సెల్ ఫోన్లలో సెల్ఫీలు దిగటం అవి ఇతరులకు చూపించడం చట్ట ప్రకారం నేరమని ఒకవేళ అలా చేస్తే ఎన్నికల నిబంధన 49 ఎం ప్రకారం ఎన్నికల అధికారులు గుర్తించి ఓటర్ను బయటకు పంపిస్తారు. ఆ ఓటును 17 ఏ రిజిస్టర్లో నమోదు చేసి లెక్కింపు సమయంలో పరిగణలోకి తీసుకోరు అంతేకాకుండా అలా చేసిన వారు శిక్షార్హులు అవుతారు అని జిల్లా ఎన్నికల అధికారులు తెలియజేయడం జరిగింది. పోలింగ్ కేంద్రాల వద్ద ఏ విధమైన అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత ఏర్పాట్లు చేశారు. ఓటర్లు తమ ఓటు హక్కును ప్రశాంతంగా ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ప్రియాంక అల జిల్లా ఎస్పీ వినోద్ జి ఓటర్లను కోరారు.
పోలింగ్ ప్రారంభం..
228
previous post




Total views : 78870