కృష్ణాజిల్లా, గుడివాడ నియోజకవర్గం: ఎమ్మెల్యే కొడాలి నాని నామినేషన్ అఫిడవిట్ లో పొందుపరిచిన అంశాలపై శుక్రవారం ఆర్ వో కార్యాలయంలో నామినేషన్ల స్క్రూట్ ని సమయములో తాము లేవనెత్తిన అభ్యంతరాలను గుడివాడ రిటర్నింగ్ అధికారి పట్టించుకోకపోవడం, తమను దుర్భాషలాడటం జరిగిందని గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు (Ravi Venkateswar Rao) అన్నారు. శుక్రవారం తాము కొడాలి నాని పై చేసిన ఆరోపణలకు సంబంధించి పూర్తి ఆధారాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించినా పట్టించుకోని ఆర్ వో ఈరోజు అదే ఆధారాలు మరలా సమర్పించమని టిడిపి నాయకుడు తులసి బాబుకు నోటీసులు ఎలా జారీ చేశారని రావి ప్రశ్నించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఈరోజు కూడా తాము అదే ఆధారాలను ఆర్వో కు సమర్పించామని, తాము లేవనెత్తిన అభ్యంతరాలపై అధికారుల వద్ద నుండి సమాచారం తెప్పించకోవలసిన బాధ్యత ఆర్వోకు ఉందని అన్నారు. శుక్రవారం తాము సమర్పించిన ఆధారాలు తప్పుడు ఆధారాలుగా రిటర్నింగ్ అధికారి భావిస్తే ఈరోజు మరల అదే ఆధారాలను ఎలా సబ్మిట్ చేయమని నోటీసులు జారీ చేస్తారని అన్నారు. రిటర్నింగ్ అధికారి వైసిపికి అనుకూలంగా పనిచేస్తున్నారని, కొడాలి నాని అధికారులను భయభ్రాంతులకు, ప్రలోభాలకు గురిచేస్తున్నాడని రావి అన్నారు. అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తితో తాము పోరాడుతున్నామని, ఎప్పటికైనా తామే విజయం సాధిస్తామని, రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా రాజారెడ్డి పాలన నడుస్తుందని రావి అన్నారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కుప్పం ఎయిర్పోర్టు భూసేకరణకు మార్గం సుగమం..కుప్పం విమానాశ్రయ భూసేకరణకు మార్గం సుగమమైంది. 150 ఎకరాల సేకరణ నోటిఫికేషన్లపై జోక్యం చేసుకోబోమని సుప్రీం కోర్టు తెలిపింది. భూసేకరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను ఇటీవల ఏపీ హైకోర్టు కొట్టేసింది. దీంతో ఉన్నత న్యాయస్థానం తీర్పుపై పలువురు సుప్రీం కోర్టులో…
- 15 ఏళ్ల బాలిక గర్భవిచ్ఛిత్తి కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..ఇక్కడ బాలికది సాధారణమైన గర్భంకాదు.. అత్యాచారం చేయబడి గర్భం దాల్చింది. తన గర్భంలో పెరుగుతున్నదీ..పెంచుతున్నదీ నిందితుడి ప్రతిరూపం..గర్భాన్ని విచ్ఛిన్నం చేస్తే..తల్లీ బిడ్డల ప్రాణాలకు హాని జరుగొచ్చు..లేదా తల్లి క్షేమంగా ఉన్నా…బిడ్డ చనిపోతే…భ్రూణ హత్య ..అదీ సరికాదు…సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఏవైనా సరే..…
- బెంగాల్లో మరోసారి విజయం మాదే -మమత..పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్..టీఎంసీ ఘన విజయం సాధిస్తుందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో 226 కంటే ఎక్కువ సీట్లను టీఎంసీ గెలుస్తుందని స్పష్టం చేశారు. ‘మా-మాటి-మానుష్’ స్ఫూర్తితో టీఎంసీ ప్రభుత్వాన్ని తిరిగి…




Total views : 61691