Sunday, June 14, 2026
News Navigation
Sunday, June 14, 2026
News Navigation

Breaking

Sunday, June 14, 2026
Home Andhra Pradesh వైసీపీ మేనిఫెస్టో విడుదల..

వైసీపీ మేనిఫెస్టో విడుదల..

by Satya
CM Jagan

వైసీపీ మేనిఫెస్టో(YCP Manifesto)ను విడుదల చేశారు. ఇప్పుడు కూడా సంక్షే పథకాలకు ప్రథాన్యత ఇస్తూ రెండు కీలక హామీలు ఇవ్వనున్నారు. మహిళలు, రైతులను ఆకర్షించే రెండు పథకాలు మేనిఫెస్టోలో ప్రధానంగా హైలెట్ చేయనున్నట్లు సమాచారం. అలాగే బీసీలను ఆకర్షించేలా ఓ పథకాన్ని మేనిఫెస్టోలో పెట్టనున్నట్లు తెలుస్తోంది. మరిన్ని హామీలు ఇవ్వకుండా కొద్ది మొత్తంలోనే పథకాలను మేనిఫెస్టోలో పెట్టాలని నిర్ణయించారని ఆ పార్టీలు నాయకులు చెప్పుకుంటున్నారు.

ఇది చదవండి: మైలవరంలో వసంత కృష్ణ ప్రసాద్ సతీమణి శిరీష ప్రచారం..

కేవలం ఓ పాంప్లెట్ సైజులో నవరత్నాలను హైలెట్ చేస్తూ మేనిఫెస్టోను విడుదల చేయాలని అటు సీఎం జగన్(CM Jagan) సైతం నిర్ణయించారట. ఇప్పటికే అమలు చేస్తున్న కొన్ని పథకాలనూ యథావిధిగా కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారట. మరోసారి అధికారంలోకి వచ్చేలా సీఎం జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. అయితే మేనిఫెస్టో విడుదలపై క్లారిటీ లేదు. విడుదల చేసే అవకాశం ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారు. కానీ అధికారికంగా శనివారం విడుదల చేస్తామని చెప్పలేదు. దీంతో మేనిఫెస్టో విడుదలపై కొంత గందరగోళం నెలకొంది.

Follow us on : FacebookInstagram, YouTube & Google News


  • స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.
    విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ప్రమాదానికి కారణమైన వారిగా భావిస్తున్న 15 మందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసి… మరికొందరిని బదిలీ చేసింది. నాసిరకం మెటీరియల్ కొనుగోలు, పర్యావేక్షణ లోపం, ముందస్తు భద్రతా చర్యలు…
  • ప్రకాశం జిల్లాలో వెలుగులోకి వైసీపీ నాయకుడి నిర్వాకం.
    ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. చీమకుర్తి మండలం తొర్రగుడిపాడు గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు బత్తుల సుబ్బారావుపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. జిల్లాలోని సింగరాయకొండ, ఉలవపాడు ప్రాంతాలకు చెందిన నాలుగు గిరిజన కుటుంబాలను పనుల నిమిత్తం గ్రామానికి రప్పించిన…
  • కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి.
    ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ‘రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం’ పేరుతో తిరుపతి సమీపంలోని దామినేడులో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్‌. మాధవ్‌ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వ…

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Advertisements

You may also like

Our Visitor

023327
Total views : 141764

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.