వైసీపీ మేనిఫెస్టో(YCP Manifesto)ను విడుదల చేశారు. ఇప్పుడు కూడా సంక్షే పథకాలకు ప్రథాన్యత ఇస్తూ రెండు కీలక హామీలు ఇవ్వనున్నారు. మహిళలు, రైతులను ఆకర్షించే రెండు పథకాలు మేనిఫెస్టోలో ప్రధానంగా హైలెట్ చేయనున్నట్లు సమాచారం. అలాగే బీసీలను ఆకర్షించేలా ఓ పథకాన్ని మేనిఫెస్టోలో పెట్టనున్నట్లు తెలుస్తోంది. మరిన్ని హామీలు ఇవ్వకుండా కొద్ది మొత్తంలోనే పథకాలను మేనిఫెస్టోలో పెట్టాలని నిర్ణయించారని ఆ పార్టీలు నాయకులు చెప్పుకుంటున్నారు.
ఇది చదవండి: మైలవరంలో వసంత కృష్ణ ప్రసాద్ సతీమణి శిరీష ప్రచారం..
కేవలం ఓ పాంప్లెట్ సైజులో నవరత్నాలను హైలెట్ చేస్తూ మేనిఫెస్టోను విడుదల చేయాలని అటు సీఎం జగన్(CM Jagan) సైతం నిర్ణయించారట. ఇప్పటికే అమలు చేస్తున్న కొన్ని పథకాలనూ యథావిధిగా కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారట. మరోసారి అధికారంలోకి వచ్చేలా సీఎం జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. అయితే మేనిఫెస్టో విడుదలపై క్లారిటీ లేదు. విడుదల చేసే అవకాశం ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారు. కానీ అధికారికంగా శనివారం విడుదల చేస్తామని చెప్పలేదు. దీంతో మేనిఫెస్టో విడుదలపై కొంత గందరగోళం నెలకొంది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
- జనసేన అధినేత పవన్కల్యాణ్ సంచలన నిర్ణయం.ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
- గుంటూరు జిల్లా తాడేపల్లిలో 92 ఎకరాల భూ వివాదం.కోట్ల రూపాయల విలువైన భూములను కాజేసేందుకు భారీ కుట్ర జరిగిందంటూ గుంటూరు జిల్లా తాడేపల్లిలో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సోదరుడు రామకృష్ణ తమకు భారీ మొత్తంలో డబ్బులు, అపార్ట్మెంట్లలో ప్లాట్లు ఇస్తామని హామీ ఇచ్చి…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 90705