289
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలలో భారీగా నగదు గల్లంతైన ఘటన కలకలం రేపింది. ఎస్ ఆర్ నగర్ రూట్ పరిధిలో ఎస్బీఐ ఏటీఎంలలో నగదు గల్లంతైనట్లు సీఎంఎస్ సెక్యూరిటీ సంస్థ గుర్తించింది. ఎస్బీఐ ఏటీఎంలలో సీఎంఎస్ సెక్యూరిటీ సంస్థ నగదు ఫిల్ చేస్తుంది . ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ ఫిర్యాదు చేసింది. కోటి 20 లక్షల 98 వేల 500 రూపాయల నగదు గల్లంతైనట్లు ఫిర్యాదు చేసింది. ఏటీఎంలలో నగదు లోడింగ్ సమయంలో అవకతవకలు జరిగినట్లు సీఎంఎస్ గుర్తించినట్లు తెలుస్తోంది. సిబ్బంది చేతివాటమా? లేక మరేదైనా కారణమా అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు పోలీసులు.