కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. సంజయ్ సింగ్ సారథ్యంలో కొత్తగా ఏర్పాటైన రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా బాడీని సస్పెండ్ చేసింది. బీజేపీ ఎంపీ, మాజీ ఎఫ్డబ్ల్యూఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ చరణ్ సింగ్ సన్నిహితుడైన సంజయ్ సింగ్ డబ్ల్యూఎఫ్ఐ కొత్త అధ్యక్షుడుగా ఎన్నిక కావడంపై తీవ్ర నిరసలకు దారితీసిన నేపథ్యంలో క్రీడల శాఖ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. సంజయ్ సింగ్ గత గురువారంనాడు డబ్ల్యూఎఫ్ఐ కొత్త అధ్యక్షుడిగా 47 ఓట్లకు 40 ఓట్లు గెలుచుకుని సంచలన విజయం సాధించారు. అధ్యక్షుడిగా ఎన్నిక కాగానే ఆయన ఈ ఏడాది చివర్లో గోండా (యూపీ)లోని నందిని నగర్లో నేషనల్స్ జరుగుతాయని ప్రకటించారు. ఈ ప్రకటనను తొందరు పాటు చర్యగా, రెజ్లర్లకు తగిన నోటీసు ఇవ్వకుండా తీసుకున్న నిర్ణయంగా క్రీడల మంత్రిత్వ శాఖ ఆదివారంనాడు ఒక ప్రకటనలో తెలిపింది.
కేంద్ర క్రీడా శాఖ సంచలన నిర్ణయం
380
previous post




Total views : 200882