రాజోలు దివిలో ఓఎన్జీసీ వల్ల పలు గ్రామాల్లో ఇబ్బంది పడుతున్నా వారిని గుర్తించి.. NGD ఒక్క ప్రత్యేకమైన కమిటీ నియమించి దాని ద్వారా ఓఎన్జిసి నడ్డి విరిసి 22.76 లక్షల రూపాయలు ఓఎన్జీసీ నుంచి నిధులు మంజూరు చేయడంతో రాజోలు దీవిలో ఉన్న పలు గ్రామాల్లో చింతలపల్లి గ్రామానికి 47లక్షల రూపాయల వ్యయంతో వాటర్ ట్యాంకు నిర్మాణం, అదే విధంగా గుడిమెళ్ళంక గ్రామానికి 8లక్షలు, కేశనపల్లి 63లక్షల రూపాయల వ్యయంతో.. అదేవిధంగా రాజోలు ఏరియా ఆసుపత్రికి డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు 65లక్షల నిధులను మంజూరు చేసినట్లు NGD కమిటీ సభ్యుడు యనమల వెంకటపతి రాజా తెలిపారు. ఓఎన్జిసి ఈవో అమిత్ నారాయణ అన్ని విధాల కృషి చేస్తున్నారని రాబోయే రోజుల్లో ఓఎన్జీసీ నుంచి భారీ స్థాయిలో నిధులను తెచ్చి రాజోలు ప్రాంతం మరింత అభివృద్ధి చేస్తామని ఆయన అన్నారు. ఓఎన్జిసి చేస్తున్న సేవలను నాయకులు అవగాహన కల్పించలేకపోతున్నారని మాలాంటి వాళ్లు ఓఎన్జీసీ చేస్తున్న సేవలను ప్రజల్లోకి తీసుకుని వెళ్తామని వెంకటపతి రాజా అన్నారు. ఈ కార్యక్రమంలో NGD మరో సభ్యులు పీకే రావు, ప్రజా సంఘ నాయకులు పాల్గొన్నారు.
Tag:
అంబేద్కర్ కోనసీమ జిల్లా
పి గన్నవరం నియోజకవర్గ నాలుగు మండలాలకు సంబంధించిన అంగన్వాడి టీచర్స్ మరియు హెల్పర్స్ 13వ రోజు సమ్మెలో భాగంగా పి గన్నవరం తహసిల్దార్ కార్యాలయం నుండి త్రీ రోడ్ జంక్షన్ వరకు కొవ్వొత్తులతో ర్యాలీని నిర్వహించారు. అంగన్వాడీలకు ఫోన్ లు ఇచ్చాము. చీరలు పెట్టాము. సెల్ ఫోన్ లకు చార్జీలు ఇచ్చాము అని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి చెప్తున్నారు. ఫోన్లు మేము సొంతంగా వాడుకోవడానికి కాదని మా డ్యూటీ నిమిత్తం ఇచ్చారని అవి కూడా పనిచేయడం లేదని మా సొంత సెల్ ఫోన్లతో మా బాధ్యతలను నిర్వర్తిస్తున్నామని వాపోతున్నారు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు తమ నిరసనను ఆపబోమని తమ న్యాయపరమైన కోరికలు ప్రభుత్వం వెంటనే తీర్చాలని అంగన్వాడీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. తమ న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చకపోతే సమ్మె ఇంకా ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.






Total views : 78181