ఎన్నికల ప్రచారంలో బీజేపీ పార్టీ ముస్లింలకు మతపరమైన రిజర్వేషన్లను అమలు చేస్తున్నారని తాము అధికారంలోకి రాగానే వాటిని తొలగించి ఎస్సీ, ఎస్టీలకు అమలు చేస్తామని వాగ్ధానం చేస్తుంది. కాగా రిజర్వేషన్లపై బీజేపీ ఆరోపణలపై ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. తెలంగాణలో మతపరమైన రిజర్వేషన్లపై బీజేపీ అబద్ధాలు చెబుతోందని అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ముస్లింలు తమ మతం ఆధారంగా కాకుండా సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన నేపథ్యంలో రిజర్వేషన్లు పొందుతున్నారు.వెనుకబడిన ముస్లింల కోసం రూపొందించబడిన జాబితా ప్రకారమే రిజర్వేషన్ పొందుతున్నారని ఒవైసీ తెలిపారు.
Tag:
అసదుద్దీన్
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఎమ్ఐఎమ్ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీని నాశనం చేసినట్లే కాంగ్రెస్ను కూడా రేవంత్ రెడ్డి కనుమరుగు చేస్తాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ భావాజాలం కలిగి ఉన్నాడని.. కాంగ్రెస్ కూడా ప్రస్తుతం ఆర్ఎస్ఎస్ ఆధీనంలోనే ఉందని వ్యాఖ్యానించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కవల పిల్లలని చెప్పారు. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉంటేనే ప్రజలకు న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. తాము ఏ పార్టీ ఏ టీమ్, బీ టీమ్ కాదని స్పష్టం చేశారు. ప్రజలకు ఎవరు న్యాయం చేస్తారో వారికి మద్దతు ఇస్తామని అన్నారు.






Total views : 78208