తిరుపతి, High Tension In Chittoor Punganur
చిత్తూరు(Chittoor) పుంగనూరులో కొనసాగుతున్న ఉద్రిక్తతలు. రాత్రి సదుం మండలం ఎర్రతివారిపల్లెలో బీసీవై పార్టీ బోడె రామచంద్ర యాదవ్ కాన్వాయ్ లో 10 వాహనాలను ధ్వంసం. రాళ్లు రువ్వి, కట్టెలతో దాడులు చేసిన దుండగులు. సదుం పోలీస్ స్టేషన్ ముందే ప్రచార రథాన్ని తగలబెట్టిన దుండగులు. సదుం మండలంలో వైసీపీ బీసీవై పార్టీ. మధ్యన కొనసాగుతున్న గొడవలు.
ఇవాళ గొడవలు జరిగిన ప్రాంతాలలో పర్యటించనున్న డీఐజీ అమ్మిరెడ్డి | DIG Ammireddy..
రాత్రి నుంచి సదుం మండలంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు. పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓటమి భయంతోనే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారు.
బీసీవై పార్టీకి వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేకుండానే తన అనుచరులతో దాడి చేస్తున్నారు పెద్దిరెడ్డి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన బోడె రామచంద్ర యాదవ్.
మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు, వైసిపి కార్యకర్తలే తమ వాహనాలు ధ్వంసం చేశారని బోడె రామచంద్ర యాదవ్ ఆగ్రహం, అవేదన.
ఓటమి భయంతోనే…
పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓటమి భయంతోనే పుంగనూరులో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్. పుంగనూరు లోని గ్రామాలలో ప్రశాంత వాతావరణంలో ప్రచారం చేసుకుంటూ ఉండగా తమ అనుచరులతో తనపై, తన అనుచరుల పై దాడి చేయించి వాహనాలను ధ్వంసం చేయించి ప్రచార రథాలకు నిప్పు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు బోడె రామచంద్ర యాదవ్. గత ఐదు సంవత్సరాలుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని, ఎన్నికల కోడ్ వచ్చిన తరువాత కూడా పెద్దిరెడ్డి ఆగడాలు ఆగలేదని పోలీస్ స్టేషన్ ముందే తన ప్రచార రథాన్ని తగులబెట్టినా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు అని ఆరోపించారు బోడే. దాదాపు 30 మందికి పైగా తన అనుచరులకు గాయాలయ్యాయని, వారందరూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారని, పదుల సంఖ్యలో వాహనాలను ధ్వంసం చేసి ప్రచార రథాలకు నిప్పంటించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోవు ఎన్నికలలో పుంగనూరు ప్రజలు ఇవన్నీ గమనించి ఓట్లు వేయాలని అభ్యర్థించారు బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్. నిన్న జరిగిన గొడవల కారణంగా ఇరువర్గాలపై పోలీసులు 307 కేసులను నమోదు చేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- భోజ్శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పుమధ్యప్రదేశ్లో భోజ్ శాల ఆలయ కేసులో కీలక తీర్పు వెలువడింది. వివాదాస్పద స్థలం ఆలయానికే చెందుతుందని ఆ రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసింది. అక్కడ సరస్వతిదేవి విగ్రహం ఏర్పాటు చేసుకోవచ్చని కేంద్రానికి హైకోర్టు సూచన చేసింది. ఆలయ ప్రాంతాన్ని పురావస్తుశాఖ అధీనంలోకి…
- మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..మంచిర్యాల జిల్లావ్యాప్తంగా అక్రమ పశువుల రవాణాను అరికట్టేందుకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. జిల్లా కేంద్రంలోని ఎం కన్వెన్షన్ హాల్లో గోరక్షక్ సభ్యులతో డీసీపీ ఏ. భాస్కర్ ప్రత్యేక సమన్వయ సమావేశం నిర్వహించారు. చట్టప్రకారం ఆవులు, దూడలను వధించడం పూర్తిగా…
- నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం..నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం పాటిస్తున్నాడు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. మోదీ, చంద్రబాబు పిలుపునిచ్చిన పర్యావరణ పరిరక్షణ, ఇంధన పొదుపు సందేశాలను ఆచరణలో చూపిస్తున్నారు. నిరంతరం ప్రజల మధ్యే ఉంటూ, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా దూసుకుపోతున్న ఎమ్మెల్యే… ఖర్చు…





Total views : 77926