తిరుపతి, High Tension In Chittoor Punganur
చిత్తూరు(Chittoor) పుంగనూరులో కొనసాగుతున్న ఉద్రిక్తతలు. రాత్రి సదుం మండలం ఎర్రతివారిపల్లెలో బీసీవై పార్టీ బోడె రామచంద్ర యాదవ్ కాన్వాయ్ లో 10 వాహనాలను ధ్వంసం. రాళ్లు రువ్వి, కట్టెలతో దాడులు చేసిన దుండగులు. సదుం పోలీస్ స్టేషన్ ముందే ప్రచార రథాన్ని తగలబెట్టిన దుండగులు. సదుం మండలంలో వైసీపీ బీసీవై పార్టీ. మధ్యన కొనసాగుతున్న గొడవలు.
ఇవాళ గొడవలు జరిగిన ప్రాంతాలలో పర్యటించనున్న డీఐజీ అమ్మిరెడ్డి | DIG Ammireddy..
రాత్రి నుంచి సదుం మండలంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు. పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓటమి భయంతోనే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారు.
బీసీవై పార్టీకి వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేకుండానే తన అనుచరులతో దాడి చేస్తున్నారు పెద్దిరెడ్డి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన బోడె రామచంద్ర యాదవ్.
మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు, వైసిపి కార్యకర్తలే తమ వాహనాలు ధ్వంసం చేశారని బోడె రామచంద్ర యాదవ్ ఆగ్రహం, అవేదన.
ఓటమి భయంతోనే…
పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓటమి భయంతోనే పుంగనూరులో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్. పుంగనూరు లోని గ్రామాలలో ప్రశాంత వాతావరణంలో ప్రచారం చేసుకుంటూ ఉండగా తమ అనుచరులతో తనపై, తన అనుచరుల పై దాడి చేయించి వాహనాలను ధ్వంసం చేయించి ప్రచార రథాలకు నిప్పు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు బోడె రామచంద్ర యాదవ్. గత ఐదు సంవత్సరాలుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని, ఎన్నికల కోడ్ వచ్చిన తరువాత కూడా పెద్దిరెడ్డి ఆగడాలు ఆగలేదని పోలీస్ స్టేషన్ ముందే తన ప్రచార రథాన్ని తగులబెట్టినా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు అని ఆరోపించారు బోడే. దాదాపు 30 మందికి పైగా తన అనుచరులకు గాయాలయ్యాయని, వారందరూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారని, పదుల సంఖ్యలో వాహనాలను ధ్వంసం చేసి ప్రచార రథాలకు నిప్పంటించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోవు ఎన్నికలలో పుంగనూరు ప్రజలు ఇవన్నీ గమనించి ఓట్లు వేయాలని అభ్యర్థించారు బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్. నిన్న జరిగిన గొడవల కారణంగా ఇరువర్గాలపై పోలీసులు 307 కేసులను నమోదు చేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రేపు మరోసారి ముంబైకి వెళ్లనున్నారు. కొంతకాలంగా రొటేటర్ కఫ్ గాయంతో బాధపడుతున్న ఆయన..భుజాలకు సంబంధించిన చికిత్స చేయించుకోనున్నారు. రెండు భుజాల కండరాలు దెబ్బతినడంతో ఇబ్బంది పడుతున్న పవన్ కల్యాణ్..ముంబై హాస్పిటల్లో ఇప్పటికే వైద్య పరీక్షలు…
- హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.అమెరికాలో హెచ్-1బీ, పర్మ్ వర్క్ వీసాల జారీలో జరుగుతున్న అక్రమాలపై ట్రంప్ ప్రభుత్వం భారీ దర్యాప్తు చేపట్టింది. అమెరికా కార్మిక శాఖ ఇన్స్పెక్టర్ జనరల్ ఆంథోనీ డి’ఎస్పోసిటో వెల్లడించిన వివరాల ప్రకారం.. వీసా మోసాలపై ఇప్పటికే డజన్ల కొద్దీ సమ్మన్లు, సబ్పోనాలు…
- అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలక అడుగు పడుతోంది. ఇప్పటికే కేంద్ర కార్యాలయాలు, బ్యాంకులు, హోటల్స్, విద్యా సంస్థలతో రూపుదిద్దుకుంటున్న రాజధాని ప్రాంతానికి ఇప్పుడు హైటెక్ స్కై కనెక్టివిటీ కూడా అందుబాటులోకి రానుంది. ఉండవల్లి సమీపంలో ఆధునిక సదుపాయాలతో హెలిపోర్ట్…




Total views : 194716