బీజేపి అభ్యర్థి ప్రజా ఆశీర్వాద యాత్ర (Praja Ashirwada Yatra)…
చేవెళ్ల పార్లమెంట్ బీజేపి అభ్యర్థి ప్రజా ఆశీర్వాద యాత్ర (Praja Ashirwada Yatra)లో భాగంగా ఈ రోజు ఉదయం శంషాబాద్ మండలంలోని అమ్మపల్లి గుడి శ్రీ సీతారామస్వామి సాక్షిగా ప్రారంభించడం జరిగింది. ఈ నేపధ్యంలో అక్కడి నుంచి యాత్ర చేవెళ్ల నియోజకవర్గంలో నిర్వహించారు. ఈ రోజు యాత్ర షాబాద్ మండలంలో పలు గ్రామాలలో పర్యటించి అక్కడి నుంచి పరిగి నియోజకవర్గం లోని కంకల్ గ్రామానికీ చేరుకోవడం జరిగింది. ప్రతి గ్రామానికి వెళ్తున్నామని గ్రామ ప్రజల్లో చాలా సంతోషం కలుగుతున్నది దేశ భవిష్యత్తు మొత్తం మోడీ పైన ఆశలు పెట్టుకున్నారని చెప్తున్నారు.
ప్రజ ఆశీర్వాద యాత్రలో కొండ విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ…
మనకు ఉచిత బియ్యం ఇచ్చేది మోదీ, రైతులకు ఎరువులు ఇచ్చేది కూడా మోదీ కాబట్టి దేశంలో కూడా ప్రతి ఒక్క రైతులు మోది వల్లనే సంతోషంగా ఉన్నారని చెప్పారు. నేను ఈ పార్లమెంట్ నియోజకవర్గం నుండి మూడు లేదా నాలుగు లక్షల మెజార్టీలో గెలుస్తున్నారని ధీమా వ్యక్తం చేశారు. అలాగే మిగతా పార్టీలకు అభ్యర్థులు కూడా కరువయ్యారు దిక్కు మొఖం లేక వాళ్ళు అభ్యర్థులను ప్రకటించలేక సతమాతమవుతున్నారు. కాబట్టి కచ్చితంగా ప్రజలు మోడీకి వైపే ఉన్నారు మోడీని చూసి ఓటేయండి నాకు కాదు నాకు ఓటేస్తే మోడీకి వేసినట్టే అని ప్రజలు చెప్పుకుంటూ ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రజ యాత్రలో నాకు కడుపు నిండినంత సంతోశంగా ఉందన్నారు నేను ఎప్పుడు ప్రజలోన్నే ఉంటానన్నారు.
ఇది చదవండి : ఎమ్మెల్సీ ఓటు వినియోగించుకున్న మంత్రి జూపల్లి…
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి





Total views : 82558