శ్రీశైల దేవస్థానం పరిపాలన భవనంలో ఆలయ చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి ఆధ్వర్యంలో ధర్మకర్తల మండలి 20వ ట్రస్ట్ బోర్డ్ సమావేశం జరిగింది. ఈ సమావేశం సుమారు 2 గంటలపాటు సమావేశం కొనసాగింది అనంతరం ఆలయ చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ 52 ప్రతిపాదనలను ప్రవేశపెట్టగా 51 ప్రతిపాదనలకు ఆమోదం తెలిపి 1 వాయిదా వేశామన్నారు. ఈ ట్రస్ట్ బోర్డ్ సమావేశంలో ఈనెల 14 న నుండి ప్రారంభం కానున్న కార్తీక మాసోత్సవాలుకు భక్తుల కల్పించే ఏర్పాట్లపై చర్చించామన్నారు. ముఖ్యంగా క్షేత్ర పరిధిలో రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు పెట్టి మాట్లాడకూడదని గతంలో ఉన్న జిఓని మరింత కట్టుదిట్టం చేస్తామన్నారు. క్షేత్రంలో సోలార్ విద్యుత్ కోసం 7 కోట్లు అలానే భక్తులకు డార్మెంటరీ కోసం 23 కోట్లకు ఆమోదించమని క్షేత్రంలో రోడ్లకు 30 కోట్లతో పాటు నూతనంగా 60 కోట్లతో 200 రూములు నిర్మించాలని ఆమోదించామన్నారు. అలానే శ్రీశైలం క్షేత్రంలో ఎటువంటి అన్యమత ప్రచారాం జరగడం లేదని క్షేత్రంలో ధర్నాలు,నిరసనలు చేయకూడదన్నారు. గతంలో ప్రవేశపెట్టిన ఉదయాస్తమాన సేవను రద్దు చేశామని ఆసేవ స్థానంలో ప్రాతకాలసేవ పెట్టామని కమిషనర్ ఉత్తర్వులు వస్తే త్వరలో భక్తులకు ఈసేవ అందుబాటులోకి తెస్తామని ఆలయ చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి తెలిపారు.
శ్రీశైలం
నంద్యాల జిల్లా శ్రీశైలం మహా క్షేత్రంలో ఈనెల 14 నుండి డిసెంబరు 12 వరకు కార్తీక మాసోత్సవాలు జరగనున్నాయి అయితే కార్తికమాస పర్వదినాలు, సెలవురోజులలో భక్తులు అధిక సంఖ్యలో క్షేత్రాన్ని సందర్శించే అవకాశం ఉంటుందని ముందస్తు ఆలోచనతో దేవస్థానం ఈవో డి.పెద్దిరాజు కీలక నిర్ణయం తీసుకున్నారు శ్రీశైలం మల్లన్న దర్శనార్థం క్షేత్రానికి వచ్చే భక్తులందరికీ సౌకర్యవంతమైన దర్శనాలు కల్పించేందుకు వీలుగా కార్తీకమాసమంతా గర్భాలయ ఆర్జిత అభిషేకాలు, సామూహిక ఆర్జిత అభిషేకాలు, వృద్ధమల్లికార్జునస్వామి ఆర్జిత అభిషేకాలు పూర్తిగా నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటన ద్వారా తెలిపారు అదేవిధంగా కార్తీకమాసంలో రద్దీ రోజులలో శ్రీస్వామివారి స్పర్శదర్శనం కూడా పూర్తిగా నిలుపుదల చేశామని కార్తీకమాసమంతా సామూహిక, గర్భాలయా అభిషేకాలు పూర్తిగా నిలుపుదల చేయగా అలానే కార్తీక శని, అది, సోమ, కార్తీక పౌర్ణమి, ఏకాదశి రోజులలో స్పర్శ దర్శనాలు కూడా రద్దు చేసమన్నారు శని, ఆది, సోమవారం అలానే రద్దీ రోజులలో భక్తులందరికి శ్రీస్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతిస్తామన్నారు అలానే కార్తీకమాసం సాధారణ రోజులలో స్పర్శ దర్శనానికి 4 విడతలుగా పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించేందుకు నిర్ణయించామని టికెట్స్ ఆన్లైన్ లో అందుబాటులో ఉంచామని దేవస్థానం ఈవో పెద్దిరాజు నిర్ణయించారు. శ్రీశైలం వచ్చే భక్తులకు కార్తీకమాసంలో ఎలాంటి ఆ సౌకర్యాలు లేకుండా అన్ని అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు కార్తీక దీపారాధన భక్తులకు ఆలయ ఉత్తర మాడవీధిలో భక్తులు దీపాలు వెలిగించుకోవాలని తెలిపారు.





Total views : 75481