ఇవాళ ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లో పవన్ తో మర్యాదపూర్వకంగా కలవనున్న బాలశౌరి. సాయంత్రం 5.30 నుంచి 6 గంటల ప్రాంతంలో సంబరాలు చేయనున్న పార్టీ శ్రేణులు. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి గారు ఇవాళ ఉదయం 11 గంటలకు కలవనున్నారు. ఈ సందర్బంగా ఈరోజు సాయంత్రం 5 నుంచి 6 గంటల ప్రాంతంలో కృష్ణా, గుంటూరు జిల్లాలోని అన్ని మండలాల్లో బాణసంచా కాల్చి సంబరాలు చేయనున్న జనసేన నాయకులు, కార్యకర్తలు, బాలశౌరి గారి అభిమానులు, అనుచరులు. గుంటూరు పట్టణంలోని లాడ్జి సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద సాయంత్రం 6 గంటలకు దాదాపు 20 డివిజన్లకు చెందిన నాయకులు కలిసి పెద్దఎత్తున ఎంపీ బాలశౌరి గారికి మద్దతుగా బాణసంచా కాల్చనున్నారు.
andrapradesh
కృష్ణా జిల్లా, గుడివాడ చంద్రబాబు పై ఫైర్ అయిన మాజీ మంత్రి కొడాలి నాని. కోడాలి నాని మాట్లాడుతూ.. నేడు గుడివాడలో టిడిపి వర్ధంతి చేసి, చంద్రబాబు పిండం పెట్టాడు. తనపై, సీఎం జగన్ పై పిచ్చి ఆరోపణలు చేసి, సొల్లు నాయుడు వెళ్ళాడు. సీఎం లుగా వైఎస్ఆర్, జగన్ హయాంలో ఇళ్ల స్థలాలు,నీటి అవసరాలకు 6వందల ఎకరాల భూసేకరణ చేశారు. 14ఏళ్లు సీఎం గా ఉన్న చంద్రబాబు పేదల కోసం ఒక్క ఎకరా సేకరించినట్లు నిరూపిస్తే రాజకీయాలను వదిలేస్తా. ఎన్నికల్లో పోటీ చేయను, మగాడివైతే నా సవాల్ స్వీకరించాలని ఛాలెంజ్ చేసిన కొడాలి నాని. చావటానికైన సిద్ధంగా ఉన్నా. చంద్రబాబు ఉడత ఊపుడికి భయపడను. గుడివాడలో చంద్రబాబు పిచ్చి కబుర్లు ఎవ్వరూ నమ్మరు. నేను గుడివాడ ముద్దు బిడ్డను. నాలుగు సార్లు గెలిచిన చరిత్ర నాది, మరో నాలుగేళ్లు గెలుస్తా. చంద్రబాబు పార్టీని ఎన్ని సార్లు గెలిపించారు. తెలంగాణ లో బూ స్థాపితం చేశాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకున్నాడు. 5వేల కుర్చీలు వేసి పది నియోజకవర్గాల నుండి మనుషులని రప్పించి చంద్రబాబు ఏం సాధించారు. లోకేష్ కు అడ్డు వస్తాడనే జూ ఎన్టీఆర్ పైకి, బాలయ్యను వదిలాడు. లోకేష్ లాంటి కొడుకు శత్రువుకు కూడా ఉండకూడదు. వైఎస్సార్ కొన్న స్థలంలో, టిడ్కో ఫ్లాట్ల పునాదులు వేసి చంద్రబాబు వదిలేసాడు. కనీసం కాంట్రాక్టర్ కు డబ్బు కూడా చెల్లించలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్లాట్ల నిర్మాణం పూర్తి చేసి. పూర్తి స్థాయి అభివృద్ధి చేసిన లబ్ది దారులకు అప్పగించిన ఘనత సీఎం జగన్ ది. 75ఏళ్లు వచ్చి కూడా చంద్రబాబు పచ్చి అబద్ధాలు ఆడుతున్నాడు. ఎన్టీఆర్ గంజాయి మొక్క అని చెప్పి, సీఎం పదవి దోచుకున్న రోజులను ఎవ్వరూ మర్చిపోరు. కాంగ్రెస్ దగ్గర ఓనమాలు నేర్చుకున్న చంద్రబాబు మా గురించి మాట్లాడటం హాస్యాస్పదం. మరదలిని చంపి, తమ్ముడిని పిచ్చొడిని చేసిన దుర్మార్గుడు చంద్రబాబుకు తన గురించి మాట్లాడే అర్హత లేదు. తనకు బూతుల కోటలో ఎమ్మెల్యే పదవి వస్తే, కోతల కోటాలో చంద్రబాబుకు వచ్చిందా అని ప్రశ్నించారు.
గుడివాడలో ఉద్రిక్త పరిస్థితులు. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం వద్దకు చేరుకున్న టిడిపి, జనసేన ర్యాలీ. సమీపంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ఎన్టీఆర్ వర్ధంతి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే కొడాలి నాని. మెయిన్ రోడ్డుకు ఇరు వైపులా నిలబడి టీడీపీ – వైసీపీ శ్రేణుల నినాదాలు. టీడీపీ, జనసేన శ్రేణుల పైకి దూసుకెల్లే ప్రయత్నం చేసిన వైసీపీ నాయకులు. ప్రతిగా దూసుకొచ్చిన టీడీపీ శ్రేణులు. ఇరు వర్గాల మధ్య తోపులాట. అడ్డుకున్న పొలిసులు. సవాళ్లు ప్రతి సవాళ్లు చేసుకున్న నేతలు. నివురగప్పిన నిప్పులా ఉన్నా గుడివాడ.
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గద్దె రామ్మోహన్ గారు మాట్లాడుతూ.. అన్న నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో ఉన్నప్పుడు ఆయనతో పాటు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ఉండటం నా అదృష్టం. నందమూరి తారక రామారావు గారే సంక్షేమ పథకాలను దేశంలో మొదటిసారిగా మొదలుపెట్టారు. పేద ప్రజల సంక్షేమం కోసం వందల పేజీలు రాయకుండా, కూడు, గూడు, గుడ్డ అనే మూడే మూడు నినాదాలతో ముందుకు సాగిన మహా నాయకుడు ఎన్టీఆర్. ఒక రాజకీయ పార్టీని స్థాపించి ముఖ్యమంత్రిగా పనిచేసి ఎన్టీఆర్ గానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ఒక్క చిన్న మచ్చ కూడా లేకుండా జీవించారు. అదే తరహాలో తాను కూడా ఎన్టీఆర్ స్ఫూర్తిగా ముందు సాగుతున్నానని అది ఆయన నేర్పిన విలువలకు తాత్కారం. కానీ ఒకాయన తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు దోచుకున్నారు. జగన్ లక్షల కోట్లు దోచుకున్నాడని నిన్నటి వరకు పార్టీలో ఉన్న కొంతమంది వ్యక్తులు ఎన్నోసార్లు చెప్పారని, ఇప్పుడు పార్టీ నుంచి బయటికి వెళ్లి నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు, ఇలా మాట్లాడటం వారి స్థాయినే దిగజార్చుతుంది తప్పితే ఎవరికీ ఏమీ కాదు.
ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా పటమట లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, మరియు టిడిపి నాయకుడు కేశినేని చిన్ని. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన అందరి ఆరాధ్య దైవం ఎన్టీఆర్. ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఉన్నత స్థానానికి ఎదిగారు. ఏ రంగం లో ఉన్న ఆయన అగ్రగామిగా నిలిచారు. అలాంటి ఉన్నతమైన వ్యక్తికి వారసులు అయినందుకు గర్వపడుతున్నాం.
కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం, జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. గన్నవరం ఆర్టీవో చెక్ పోస్ట్ వద్ద అతివేగంగా వెళుతున్న ఆటో అదుపుతప్పి జాతీయ రహదారిపై పల్టీలు కొట్టిన వైనం. ఏలూరు వైపు నుండి విజయవాడ వైపు కు వెళ్లే క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదం. ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులకు బలమైన గాయాలు కాగా క్షతగాత్రులను 108 సహాయంతో ఆసుపత్రికి తరలించిన పోలీసులు.
అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో అంగన్వాడీ వర్కర్స్ సమ్మె 37వ రోజు చేరుకున్న నేపథ్యంలో మట్టి తింటూ నిరసన వ్యక్తం చేసిన అంగన్వాడి మహిళలు. అంగన్వాడీ టీచర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత 36 రోజులుగా చేస్తున్న నిరవదిక సమ్మె బుధవారం 37వ రోజుకు చేరింది. అందులో భాగంగా అనంతపురం జిల్లా గుత్తి ఐసిడిఎస్ కార్యాలయం ఎదురుగా అంగన్వాడి టీచర్ల దీక్షా శిబిరంలో మట్టిని తింటూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. అంగన్వాడి టీచర్లు మాట్లాడుతూ గత 36 రోజులుగా అంగన్వాడి టీచర్లు నిరవదిక సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదని జగన్ సర్కార్ పై మండిపడ్డారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ టీచర్ల సంఘాలతో చర్చలకు పిలిచి సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ సమ్మె మరింత ఉధృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించారు. అంగన్వాడి యూనియన్ నాయకులతో ఐదు సార్లు చర్చలు జరిపి విఫలం చేయడం చాలా విడ్డూరమన్నారు. ఇచ్చిన హామీలను జీవో రూపంలో ఇస్తే తక్షణమే నిరవధిక సమ్మెను విరమింప చేస్తామని అంగన్వాడి టీచర్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లలు, ఆయాలు, సిఐటియు నాయకులు పాల్గొన్నారు.
సంక్రాంతి పండుగ వరస సెలవులు రావడంతో పట్నం వదిలి పల్లె బాటపడుతున్న ప్రజలు దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద తెల్లవారుజాము నుంచి వాహనాల రద్దీ క్రమ క్రమంగా పెరుగుతుంది. దీనికి తగ్గట్టుగా టోల్ ప్లాజా అధికారులు విజయవాడ వైపు ఎక్కువ టోల్ భుతులను ఓపెన్ చేశారు ఫాస్టాగ్ ఉండడంతో త్వర త్వరగా వెళ్తున్న వాహనాలు ఫాస్టాగ్ రాకముందు సొంతుర్లకు వెళ్లే వాహనదారులు చాలా ఇబ్బంది పడేవారు. రేపు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా సెలవులు ఉండడంతో వాహనాల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది.
విజయవాడ, బుద్ధ వెంకన్న, టిడిపి ఉత్తరాంధ్ర ఇంఛార్జ్. కొడాలి నాని గుడివాడ పిచ్చికుక్క. కొడాలి నానికి రేబీస్ ఇంజెక్షన్లు చేయించాలి అని చాలా సార్లు చెప్పాను. జనవరి 18న ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా చంద్రబాబు గుడివాడలో సభ పెడుతున్నారు. ఊరంతా తిరుగుతానని అంటున్నాడు కొడాలి నాని.. ఏం చేస్తాడో అని ఇంజెక్షన్లు కొన్నాను. నా సొంత డబ్బులతో 5 రేబీస్ ఇంజెక్షన్లు కొని గుడివాడ పార్శిల్ చేస్తున్నా. జనాల సేఫ్టీ కోసం ఇంజెక్షన్లు కొన్నాను. కొడాలి నాని రెండు కాళ్ళూ విరగొట్టి పొయ్యిలో పెడతా చంద్రబాబు ను తిడితే. కొడాలి నానికి ఇంజెక్షన్లు చేయించాలని గుడివాడ ప్రజలకు విజ్ఞప్తి. తెలంగాణ ఉద్యమ సారధి నేను. కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ దీక్షలు పూనింది నేను. కేశినేని నాని ఆఫీసు బోర్డులపై బుద్ధ వెంకన్న కామెంట్లు కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ పేటెంట్ రైట్స్ నావి, చంద్రబాబు వి. కనకదుర్గ ఫ్లైఓవర్ మేమే పెట్టామని బోర్డులు పెట్టుకుంటే అదంతా అభూతకల్పన. మరో నలుగురైదుగురికి రేబిస్ ఇంజెక్షన్లు పంపాలి. డబ్బులు టైట్ గా ఉన్నాయి చూసుకుని పంపిస్తా. ఉషశ్రీ, శంకరనాయక్, కాపు రామచంద్రారెడ్డి, పార్థసారథి లాంటి బలహీన వర్గాలనే టార్గెట్ చేస్తున్నారు. బలహీన వర్గాలు చంద్రబాబు కు కొమ్ము కాస్తున్నారని టార్గెట్. బిసి బస్సు యాత్రలో మొత్తం రెడ్లే. I am BC… చంద్రబాబు కు బిసిలు కమిట్మెంట్ గా ఉంటారు.
అమరావతి, ఈనెల 11న వైసీపీ తీర్థం పుచ్చుకోవటానికి రంగం సిద్ధం చేసుకున్న కేసినేని నాని. తనతో పాటు మరో 5 అసెంబ్లీ సీట్లు కోరిన నాని. విజయవాడ తూర్పు నుండి తన కూతురు కేసినేని శ్వేతకు. విజయవాడ పశ్చిమ నుండి ఎంఎస్ బేగ్, నందిగామ నుండి కన్నెగంటి జీవరత్నం, తిరువూరు నుండి నల్లగట్ల స్వామి దాసుకు, మైలవరం నుండి బొమ్మసాని సుబ్బారావుకు ఇవ్వమని అడిగిన నాని. తనకు ఎంపీ పదవి తోపాటు రెండు సీట్లు మాత్రమే వాగ్దానం చేసిన అధిష్టానం.