తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఏపి రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు ఆందోళనలు చేస్తున్నారు. ఏలూరు జిల్లా కైకలూరులో అంగన్వాడీల నిరసనలు 15 వ రోజూ కొనసాగుతున్నాయి. ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా కైకలూరు మండల పరిషత్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు ప్లేట్లపై గరిటెలతో శబ్దాలు చేస్తూ ఆందోళనలు చేశారు. మాట ఇచ్చాడు జగనన్న …మడమ తిప్పాడు జగనన్న, ఇదేమీ రాజ్యం, ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం అంటూ అంగన్ వాడీలు నినాదాలు చేశారు.
Tag:





Total views : 78685