ముఖ్యమంత్రి జగన్ బుధవారం కాకినాడ వస్తున్నారు. అయితే ఆయన పర్యటన పూర్తిగా బహిరంగ సభకి పరిమితం చేశారు. వాస్తవానికి ఆయన కాకినాడలో నూతనంగా నిర్మించిన కొండయ్య పాలెం ఫ్లై ఓవర్, కళాక్షేత్రం, సైన్స్ మ్యూజియం, స్కేటింగ్ ట్రాక్ ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో పాల్గొనాలి. కానీ కాకినాడలో అంగన్వాడీలు, సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేస్తున్నారు. వాలంటీర్లు కూడా ఆందోళనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన పర్యటన పరిమితమవుతోంది. ఎస్పీ ఆఫీసులో హెలిప్యాడ్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి 30 మీటర్ల దూరంలో ఉన్న బహిరంగ సభ ప్రాంగణానికి సంక్షేమ పథకాల లబ్ధిదారులతో శోభాయాత్ర గా వెళ్తారు. బహిరంగ సభ నుంచే వాటిని ప్రారంభిస్తారు.
Tag:
Angawadi strike
బాపట్ల జిల్లాలో ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో 13వ రోజు అంగన్వాడీలు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. లక్షపై చిలుకు ఉన్న అంగన్వాడీల పట్ల ఎందుకు అంత నిర్లక్ష్యం. ఈ సందర్భంగా అంగన్వాడీలు మాట్లాడుతూ 13 రోజుల నుండి మేము సమ్మెలు దీక్షలు చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చీమకుట్టినట్లు అయినా లేదని, అంగన్వాడీల పట్ల ముఖ్యమంత్రి మొండి వైఖరి, మాకెంతో బాధ కలిగిస్తుందని వారు అన్నారు. ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరిచి అంగన్వాడీ పట్ల దయచూపి అంగన్వాడి ల డిమాండ్లను పరిష్కరిస్తారని ఆశిస్తున్నామని, లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీల సమ్మె ఉధృతం చేస్తారని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అంగనవాడిలపై ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణి అవలంబిస్తుందని వారన్నారు, ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరిచి అంగన్వాడి డిమాండ్లను పరిష్కరించాలని వారు అన్నారు.




Total views : 90724