ముస్లిం మైనార్టీల పక్షపాతి వైసీపీ ప్రభుత్వమని అన్నమయ్య జిల్లా వైసీపీ విభాగం మైనార్టీ అధ్యక్షులు బేపారి మహమ్మద్ ఖాన్, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ ఫయాజూర్ రహ్మాన్ లు అన్నారు. 2015 లో జరిగిన బక్రీద్ అల్లర్ల కేసును కొట్టి వేసిన సందర్భంగా బాధితులతో కలిసి వారు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బక్రీద్ పర్వదినం సందర్భంగా సంప్రదాయ కుర్బాన్నిలో భాగంగా జరుపుకునే పండుగ పై కొంత మంది కుట్రలు పన్ని అల్లర్లు జరిగేలా ప్రేరేపించి పైశాచిక ఆనందం పొందారన్నారు. సున్నిత మైన విషయాల పై అబద్ధపు ప్రచారాలు చేస్తూ లేని వారిపై కేసులు బనాయించడం చాలా బాధాకరం. అటువంటి తరుణంలో ఇంతకాలం తర్వాత పూర్వపరాలో పరిశీలించిన న్యాయస్థానం తమకు ఎటువంటి సంబంధం లేదని తేల్చడం జరిగిందన్నారు. అన్ని సామాజిక వర్గాల ప్రజలకు అండగా ఉంటూ మత సామరస్యం పెంపొందెలా బాధ్యతగా వ్యవహరించాల్సిన ప్రజా నాయకులు కేవలం వరి స్వార్థ రాజకీయాల కోసం అక్రమంగా కేసులు బానాయించడం చాలా దుర్మార్గం అన్నారు. పార్టీలతో సంబంధం అక్రమ కేసును కొట్టి వేసేందుకు కృషి చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంపీ మిథున్ రెడ్డి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి లకు అన్నమయ్య జిల్లా వైసీపీ మైనార్టీ విభాగం అధ్యక్షులు బేపారి మహమ్మద్ ఖాన్ మున్సిపల్ వైస్ చైర్మన్ రెహమాన్, కౌన్సిలర్ అన్నాసలీం బాధితులలో పాటు ఇతర మైనార్టీ నేతలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాయచోటి ప్రాంతానికి చేనిద్న పలువురు ముస్లిం లకు ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆసిసులతో ఎమ్మెల్యే,ఎంపి ల సహకారంతో ఎమ్మెల్సి, మున్సిపల్ చైర్మన్, వైఎస్ చైర్మన్ లతో పాటు సామన్యాలను సైతం కౌన్సలర్లను చేయడం జరిగిందన్నారు .ముస్లిం అభున్నతి తో పాటు ఈద్ఘా, మసీదులు అభివృద్దికి ప్రభుత్వం నిధులు కుడా కేటాయించడం జరిగిందన్నారు .
Annamaya District News
అన్నమయ్య జిల్లా పీలేరు లో జరగబోయే చంద్రబాబు నాయుడు బహిరంగ సభకు త్వరగతిన పనులు పూర్తిచేయాలని ఆపార్టీ నాయకులతో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పీలేరు నియోజకవర్గ బాధ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు. ఆయన పీలేరు పట్టణ పరిసరాల్లో జరిగే రా కదలిరా చంద్రబాబు బహిరంగ సభ ప్రాంగణం, హెలిఫ్యాడ్ స్థల పరిశీలన, వాహనాల కోసం పార్కింగ్, బహిరంగ సభా స్థలం పరిశీలించారు. నియోజకవర్గాల వారీగా వచ్చే వాహనాలు, నాయకులు, ప్రజలు, అభిమానులకు అసౌకర్యం కలగకుండా చూడాలని అన్నారు.
పారిశుద్ధ్య కార్మికులకు సంక్రాంతి కానుక గా నిత్యవసర సరుకులను తెలుగుదేశం పార్టీ నాయకులు మేడా విజయ శేఖర్ రెడ్డి అందించారు. అన్నమయ్య జిల్లా రాజంపేట బైపాస్ రోడ్ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మేడా విజయ శేఖర్ రెడ్డి పారిశుద్ధ్య కార్మికులకు బియ్యం మరియు నిత్యావసర సరుకులను అందించి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు అన్ని విధాలా సహాయపడే వారికి ఓటేసి గెలిపించాలని, ప్రజలకు అనుకూలంగా ఉన్న వ్యక్తి మళ్లీ ఎమ్మెల్యేగా తిరిగి రావాలని, అన్నమయ్య జిల్లాను రాజంపేటకు తరలించాలని, మెడికల్ కాలేజ్ ని తీసుకురావాలని తెలుగుదేశం పార్టీ నాయకులు మేడా విజయ శేఖర్ రెడ్డి అన్నారు.





Total views : 78209