Follow us on : Facebook, Instagram, YouTube & Google News
సిఎం జగన్ మోహన్ రెడ్డి పై జరిగిన రాళ్ళదాడి పై స్పందించిన మాజీ ఎంపీ, అరకు ఎన్డీయే కూటమి పార్లమెంట్ అభ్యర్థి కొత్తపల్లి గీత (Kothapalli Geetha). సాక్షాత్తు ముఖ్యమంత్రి పైనే దాడి జరగటం దారుణమని సిఎం స్ధాయి వ్యక్తి మీదనే దాడి జరిగితే రాష్ట్రంలో మా లాంటి అభ్యర్ధులకు రక్షణ ఏముంటుందని, దీనిని ఏపి ప్రభుత్వ భద్రతా వైఫల్యంగా భావిస్తున్నామని పోటీలో వున్న అభ్యర్ధులకు కూడా రక్షణ లేకుండా పోతుందని ఈ సంఘటన పై తక్షణం ఎన్నికల కమిషన్ తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని భద్రతా వ్యవహారంలో ప్రభుత్వం తరుపున విఫలమైన సిఎస్, డిజిపి ని తక్షణమే విధులు నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నామని ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే చర్యలను సహించకూడదని తెలిపారు. మేము చేస్తున్న ఎన్నికల ప్రచారంలో సైతం అడుగడుగునా అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని , ప్రజాస్వామ్యంలో అభ్యర్థులకు ప్రచారం చేసే హక్కు ఉంటుందని తెలిపారు.
- అంబేద్కర్ జయంతి వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి
- పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని నరేంద్ర మోదీ హామీ..
- రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్న జగన్పై దాడి
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 91166