రామ జన్మభూమి అయోధ్యలో బాల రామ విగ్రహ ప్రతిష్ట లో పాల్గొనడం పూర్వజన్మ సుకృతం అని, టిటిడి చైర్మన్ గా ఉన్న కారణంగా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తరతరాలుగా కోరికగా మిగిలిన ఒక కల సాకారమై ఒక విగ్రహ రూపంలో రాముడే దివి నుంచి దిగి వచ్చినట్లు గా..మనలో మానవతా విలువలను పెంచి ప్రపంచాన్ని మార్చి మరళా రామ రాజ్యం తీసుకురావటానికి ఓ గొప్ప తాత్విక సందేశాన్ని ఇస్తున్నట్లు, ప్రపంచంలో హిందువులందరినీ ఏకతాటిపై నడిపిస్తూ గొప్ప సందేశం ఇచ్చినట్టు ఉందని,బాల రామ విగ్రహ ప్రతిష్ట లో పాల్గొనడం మాటలలో చెప్పలేనిదని భూమన కరుణాకరరెడ్డి అన్నారు. అయోధ్యపురి శ్రీరామ నామస్మరణలతో మారుమ్రోగుతూ భక్తులంతా తన్మయంతో పూలలాడుతున్నారు. టీటీడీ ద్వార ఆహ్వానం రావడం మహద్భాగ్యంగా భావిస్తున్నానని టిటిడి చైర్మన్ భువన కరుణాకర్ రెడ్డి అన్నారు.
Ayodhya Sri Rama idol consecration celebrations
దేశమంతటా 500 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న అయోధ్య రాముని విగ్రహ ప్రతిష్టకు గ్రామ గ్రామాన ఎంతో ఉత్సాహభరితంగా, ఆనంద ఉల్లాసాలతో అయోధ్య శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తూర్పు గోదావరి జిల్లా గోకవరంలో విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు కంబాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ రోజు తెల్లవారుజాము 5 గంటల నుంచి నగర సంకీర్తన ప్రతి ఇంటి ముందు శ్రీరామ్ జయరాం రంగవల్లికలతో అలంకరించుకుని సుందరకాండ పారాయణము శ్రీరామ నామ జపము లాంటివి గోకవరంమండలంలో ప్రతి ఆలయం వద్ద చాలా భక్తితో జరిపించుకున్నారు. గోకవరం పట్టాభి రామాలయం నుంచి 40 గ్రామాలలో బైక్ ర్యాలీ నిర్వహించారు. శ్రీరాముల ఉత్సవ విగ్రహాలను గ్రామాలలో వీధి వీధినా ఊరేగించారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు విక్షేంచే విధాంగా అయోధ్య లో జరిగే ప్రతి ఎల్.ఇ.డి తెరలపై చూపించారు. 10 వేలమందికి పైగా అన్న సమారాధన కార్యక్రమలు జరిగాయి.