తంబళ్లపల్లి భాజపా తెలుగుదేశం జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దాసరిపల్లి జయచంద్ర రెడ్డి గారి పర్యటన కార్యక్రమంలో భాగంగా మన తంబాలపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ పోతుల సాయినాథ్ గారు ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం పోతుల సాయినాథ్ మాట్లాడుతూ కూటమి అభ్యర్థి ఐన జయచంద్రరెడ్డి విజయం సాధించేందుకు తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. ఈ ఐదు ఏళ్ళ లో తంబల్లపల్లి ప్రజలు చాలా కష్ట పడ్డారు త్వరలో ప్రజల కు ఈ రక్షస పాలన నుండి విముక్తి లభిస్తుందన్నారు. ఉమ్మడి మేనిఫెస్టో అయిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించిన కరపత్రాలను ప్రతి ఇంట అందజేస్తూ వాటిని గురించి వివరిస్తూ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలోమండల ఉపాధ్యక్షులు మురళీకృష్ణ, జనసేన సీనియర్ నాయకులు పవన్ రెడ్డి, అరవింద్, రాజేష్, బాబు, లోకేష్ టిడిపి మరియు జనసేన నాయకులు పాల్గొని విజయ సంకల్ప యాత్రను విజయవంతం చేశారు..
Babu Surety is a guarantee for the future
ఎపి రాష్ట్ర భవిష్యత్తు చంద్రబాబుతోనే సాధ్య పడుతుందన్నారు రాష్ట్ర టీడీపీ కార్యదర్శి భత్యాల చెంగల రాయుడు, జనసేన నేత అత్తిగారి దినేష్. అన్నమయ్య జిల్లా రాజంపేట మన్నూరు లో టీడీపీ నేతలు గగ్గుటూరి ఖాదర్ బాషా గగ్గుటూరి హుమయూన్ ఆధ్వర్యం బాబు సూరిటీ భవిష్యత్తుకి గ్యారంటీ భారీ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ కార్యదర్శి భత్యాల చెంగల రాయుడు, జనసేన నేత అత్తిగారి దినేష్ ఇరువురు హాజరయ్యారు. ర్యాలి తో పాటు ఇంటింటికీ వెళ్లి చంద్రబాబు రాబోవు ఎన్నికలలో అధికారంలోకి వచ్చిన వెంటనే నేవేర్చే హమిలన్నింటిని కుడా ప్రజలకు కరపత్రాల ద్వారా చైతన్య వంతులను చేస్తూ వారి ప్రచారం కోనసాగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏడాదికి ఒక జాబు క్యాలెండర్ అన్నారు మరి నాలుగన్నర సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఎన్ని జాబు క్యాలెండర్లు విడుదల చేసారో యువత తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ ప్రభుత్వంలో ఎ ఒక్కరు సంతోషంగా లేరని ఎప్పుడప్పుడు ఎన్నికలు వస్తాయా జగన్ ప్రభుత్వాన్నిఎప్పుడు గద్దె దించూదామా అన్నట్టు ప్రజలు ఎదురు చుస్తున్నరన్నారు. జగన్ సామజిక బస్సు యాత్ర కేవలం సోకు మాత్రమే తప్ప ప్రజలలో మాత్రం ఎటువంటి స్పందలేదన్నారు. యువత భవిష్యత్తు బాగుండాలన్న రాష్ట్రంలో సిఎం గా చంద్రబాబు గారు రాజంపేట ఎమ్మెల్యే, ఎంపి అభ్యర్ధులను కచ్చితంగా గెలిపించుకునేందుకు ప్రతి ఒక్కరు సైనికుల్లా కష్ట పడలన్నారు. ఇప్పటికే జగన్ ప్రభుత్వానికి ఓటమి భయం పుట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, పార్టీ నాయకుల, కార్యకర్తలు తో పాటు మైనార్టీ నాయకుల పాల్గొన్నారు.