పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ యం శేఖర్ బాబు చేతుల మీదుగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ప్రత్తిపాడు,ఏలేశ్వరం,అన్నవరం, రౌతులపూడి ఎస్సైలతో పాటు పోలీస్ సిబ్బంది మరియు యువకులు సుమారు 80 మంది రక్తదానం చేసారు.. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ యం శేఖర్ బాబు మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ సూచనల మేరకు పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్ లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కాకినాడ రెడ్ క్రాస్ వారిచే ఏర్పాటు చేసిన ఈ రక్తదాన శిబిరంలో పోలీస్ సిబ్బందితో పాటు యువత కూడా పాల్గొని రక్తదానం చేశారని తెలిపారు. యువత ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయటం అలవాటుగా మార్చుకోవాలని యువతకు ఈ సందర్భంగా సూచించారు.
Tag:
Blood Camp
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని శంకర్ పల్లి పోలీసుల ఆధ్వర్యంలో.. అక్టోబర్ 21 పొలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలను పురస్కరించుకొని రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరంలో యువకులు పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానాం చేశారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాజేంద్రనగర్ డిసిపి జగదీశ్వర్ రెడ్డి, నార్సింగ్ ఏసిపి లక్ష్మీనారాయణ, శంకర్పల్లి సిఐ, ఎస్సై, పోలీస్ బృందం పాల్గొన్నారు. రక్తదానం చేసిన యువకులకు ఏసీపీ లక్ష్మీనారాయణ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందజేశారు.






Total views : 75193