ఎన్నికల్లో నిర్దిష్టమైన విధానాలతోనే ప్రజల వద్దకు వెళ్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేవంత్ మాట్లాడారు. తాము ఎన్నుకున్న ప్రభుత్వాన్ని చూసి ప్రజలే భయపడేలా బీఆర్ఎస్ పాలన ఉందని విమర్శించారు. కేసీఆర్ పాలన ఎలా ఉందో యువత, రైతులు, మహిళలు అడిగితే బాగా చెబుతారన్నారు. ఈ ప్రాంత ప్రజల పోరాటంలో న్యాయం, ధర్మం ఉందని నమ్మి.. ఎన్ని రాజకీయ ఇబ్బందులు ఎదురైనా సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని రేవంత్ అన్నారు. ఈ పదేళ్లలో కేసీఆర్ ఏం చెప్పారు.. ఏం జరిగిందో ప్రజలు ఆలోచించాలని కోరారు. పేదల సంక్షేమం కోసం నిధులు ఉపయోగపడ్డాయో లేదో ఆలోచన చేయాలన్నారు. నిరసనలు తెలపడం వంటి ప్రజల ప్రాథమిక హక్కులను ప్రభుత్వం కాలరాసిందని ఆరోపించారు. స్వరాష్ట్రంలో ఎన్నో మార్పులు వస్తాయని ఆశించిన యువత ఆకాంక్షలు అడియాశలు అయ్యాయని రేవంత్ విమర్శించారు. పరీక్షల నిర్వహణలో టీఎస్పీఎస్సీ విఫలమైందని ఆరోపించారు. కేసీఆర్ ఇచ్చిన పాత హామీలనే అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారన్నారు. తెలంగాణ కోసం ఎందరో యువకులు ప్రాణత్యాగం చేశారని.. రాష్ట్ర చిహ్నంలో ప్రజల త్యాగాల గుర్తులు ఉండాలన్నారు.
Brs
నేరేడుగొమ్ము మండలంలో ప్రచారానికి వెళ్ళిన రవీంద్ర కుమార్ ను అడ్డుకుని నిరసన తెలయజేసిన స్థానిక తండా ప్రజలు. నల్లగొండ జిల్లా దేవరకొండ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి రమావత్ రవీంద్ర కుమార్ కు తండా ప్రజల నుంచి చుక్కెదురైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా నేరడుగొమ్ము మండలం గుర్రపుతండాలో రవీంద్ర కుమార్ ప్రచారం నిర్వహిస్తున్న సందర్భంగా గ్రామానికి చెందిన మహిళలు, యువకులు ఎమ్మెల్యే అభ్యర్థి రవీంద్ర కుమార్ ప్రచారాన్ని అడ్డుకున్నారు. గత ఐదేళ్ల కాలంలో కనీసం గ్రామంలో ఉన్న నీటి సమస్యను కూడా పరిష్కరించలేదని, బిఆర్ఎస్ నాయకులకు తమ గ్రామంలో పర్యటించే హక్కు లేదని ఎమ్మెల్యేను నిలదీశారు. దీంతో చేసేదేమీ లేక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి రవీంద్ర కుమార్ అక్కడ నుంచి పోలిసుల సహాయంతో వెనుతిరగడం జరిగింది.
నిజామాబాద్ జిల్లా, బోధన్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్కు మద్దతుగా జరిగిన మహా యువగర్జన సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. రాజకీయంగా కేసీఆర్ను కొట్టాలంటే మరో కేసీఆరే పుట్టాలని, బీఆర్ఎస్ను ఓడించడం ఎవరి తరం కాదని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ పక్షాన యువత ఉందన్నారు. గులాబీ జెండా యువతకు అండగా ఉంటుందన్నారు. ఉద్యోగాల కల్పనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి మాట్లాడే అర్హత లేదన్నారు. 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో కేవలం 24వేల ఉద్యోగాలు మాత్రమే వచ్చాయని, అందులో తెలంగాణకు వచ్చిన ఉద్యోగాలు కేవలం పదివేలు మాత్రమే అని అన్నారు. ఆ ఉద్యోగాలు కూడా తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో చివరి రెండేళ్లు ఇచ్చారన్నారు. కానీ గత పదేళ్ల కేసీఆర్ పాలనలో 2.32 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేశామని, అందులో 1.60 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసుకున్నామన్నారు.
మల్కాజిగిరి అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి తరుపున ప్రచారం చేయడానికి ఆరోగ్య శాఖా మంత్రి హరీష్ రావు ఈరోజు మల్కాజిగిరి లో ప్రచారం నిర్వహించారు. ఆనంద్ బాగ్ నుండి మల్కాజిగిరి వరుకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం లక్ష్మి సాయి గార్డెన్ లో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హరీష్ రావు, మల్లారెడ్డి, శంబిపుర్ రాజు స్థానిక నాయకులు, ఉద్యమ కారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సంధర్బంగా హరీష్ రావు మాట్లాడుతూ మల్కాజిగిరి అభివృద్ధి చెందాలంటే గుండాలు కాదు సౌమ్యులు కావాలని అలాంటి మంచి వ్యక్తే మల్కాజిగిరి బి.ఆర్.ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి అని ఆయనను ఆదరించి గెలిపించాలని ప్రజలను కోరారు. తెలంగాణ దేశానికి ఒక రోల్ మోడల్ గా ఉంది. మన లాంటి స్కీములు దేశంలో ఏ ప్రభుత్వం అమలు చేయడం లేదని తెలిపారు.
నిర్మల్ బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై ఫైర్ అయ్యారు. కరెంట్ 3 గంటలు చాలని పీసీసీ చీఫ్ అంటున్నారని మండి పడ్డారు. ధరణి పోర్టల్ ఉండాలా? వద్దా? అన్నారు. రైతు బంధు పథకం ఓట్ల కోసం కాదన్నారు. అన్ని పార్టీల అభ్యర్థుల గురించి ప్రజలు తెలుసుకోవాలన్నారు. ఏపార్టీ గెలిస్తే లాభమో ఆలోచించాలన్నారు. ప్రతీ పార్టీ చరిత్ర చూడాలన్నారు. ఎన్నికలు రాగానే ఆగం కావద్దన్నారు. అన్నీ ఆలోచించి ఓటేయ్యాలని ప్రజలకు సూచించారు. పోరాడి తెలంగాణ సాధించుకున్నామన్ని.. తెలంగాణ రాకపోతే నిర్మల్ జిల్లా అయ్యేదా..? అన్నారు. నిర్మల్లో ఇంద్రకరణ్ రెడ్డి గెలుపు ఖాయమన్నారు. ఇంద్రకరణ్ రెడ్డి మెజార్టీ 70 నుంచి 80 వేలు దాటాలన్నారు. మమ్మల్ని ఎదుర్కొనే దమ్ము లేక ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి చేశారని ఫైర్ అయ్యారు. దళిత బంధు పుట్టించింది కేసీఆర్ అన్నారు. గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చామన్నారు. రైతు బంధు కూడా అందించామన్నారు.
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం వెంకటయ పల్లి, గద్దెగూడెం, అడవి అజిలాపూర్, కోయిల్ సాగర్ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బిఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి. ఈ సందర్భంగా గ్రామాలకు చెందిన మహిళలు మంగలహారతులతో ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ 2014 వరకు నియోజకవర్గం ఎడరిగా ఉండేదని ఇప్పుడు పచ్చన్ని పొలాలతో కళకళ లాడుతుంది. కోయిల్ సాగర్ నుండి వెంకటయ పల్లి మీదిగా కెనాల్ పనులు కేసుల కారణంగా ఆలస్యం అయిందని త్వరలో పనులు పూర్తి చేస్తామన్నారు, వెంకటాయపల్లి ఒక్క గ్రామానికి 65 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, 20 మందికి గృహలక్ష్మి మరియు దళిత బంద్, బిసి బంద్ లాంటి పథకాలు ఇవ్వడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ఓటేస్తే 3 గంటల కరెంటు వస్తుందని, రైతుబంధు లాంటి పథకాలు ఆపివేస్తారు. కావున ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు..ఈ నెల 6 న దేవరకద్ర నియోజకవర్గం కేంద్రంలో జరిగే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి బారి బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రమా శ్రీకాంత్ యాదవ్ మండల పార్టీ అధ్యక్షుడు జట్టి నరసింహారెడ్డి గ్రామ సర్పంచ్ ఆంజనేయులు, ఎంపీటీసీ పార్వతమ్మ మండలానికి చెందిన నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు…
తెలంగాణ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ థర్డ్ లిస్ట్ను కాసేపటి క్రితం ప్రకటించింది. మొత్తం 35 మంది అభ్యర్థులకు ఈ లిస్టులో చోటు దక్కింది. అయితే ఈ లిస్టులో బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన అంబర్ పేట సెగ్మెంట్లో కృష్ణా యాదవ్కు చోటు దక్కింది. ఇక బీజేపీ ముఖ్య నేతలు విజయశాంతి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, డా. లక్ష్మణ్, ఇటీవల బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు థర్డ్ లిస్ట్ లో చోటు దక్కలేదు. ఉప్పల్ సిట్టింగ్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, బోథ్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకు మూడో జాబితాలో చోటు దక్కలేదు. తొలి రెండు జాబితాల్లో 53 మంది, థర్డ్ లిస్ట్ లో 35 మంది కలిపి మొత్తం 88 మంది అభ్యర్థులను బీజేపీ ప్రకటించినట్లయింది.
ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవ చేసే అవకాశం కల్పించిన ప్రజల మేలు మరిచిపోలేను. టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్ గా మారింది…టీఆర్ఎస్ పేరిట తప్పుడు రాజీనామా చేశారు. ఇది కూచుకుళ్లకు తగునా. ఉద్యమ సమయంలో నేను ఎమ్మెల్యే పదవి కొట్లాడి రాజీనామా ఆమోదించుకున్నా. నాగర్ కర్నూల్ పై రాజేష్ రెడ్డికి జీరో నాలెడ్జి పోటీ ఎలా చేస్తాడు. రేవంత్ ఫేక్ సర్వేతో…పాపులారిటీలో నేను నెంబర్ 10 అన్నారు. ప్రజలను మోసం చేసే కూచుకుళ్ల నాగర్కర్నూల్ కు అవసరమా. సీఎం కేసీఆర్…రైతుబంధు, రైతుభీమా, వ్యవసాయంలో తలమానికంగా మారింది. సీఎం కేసీఆర్ నేను క్లోజ్ ఫ్రెండ్స్ బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉన్న శ్రేణులూ కలిసిపోయేలా కృషి చేస్తా.
హైదరాబాద్…ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలు లేనిదే తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు లేదని అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు అంబర్పేట్ నియోజకవర్గ పరిధిలోని కాచిగూడ డివిజన్ చప్పల్ బజార్లో కాలేరు వెంకటేష్ పార్టీ నాయకులతో కలిసి ఇంటింటికి ప్రచారం నిర్వహించారు ఎమ్మెల్యే ప్రచారానికి ప్రజల నుంచి భారీ స్పందన లభించింది సందర్భంగా ఎమ్మెల్యే ఖాదర్ వెంకటేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీ హైట్రిక్ నమోదు చేస్తుందని వారు తెలిపారు మరోసారి అంబర్పేట్ లో గులాబీ జెండా ఎగరవేస్తామని కాలేరు వెంకటేష్ దిమా వ్యక్తం చేశారు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ధరణి, దళిత బంధు, రైతు బంధు వద్దని కాంగ్రెస్ నేతలు అంటున్నారని.. నాలుగు పైసలు ఉన్నంత మాత్రానా ఇంత అహంకారమా అంటూ ప్రశ్నించారు. అదే విధంగా కేంద్రంపై ధ్వజమెత్తారు. మోటర్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం ఒత్తడి తీసుకొచ్చిందని.. చచ్చినా ఆ పని చేయనని చెప్పారు. రానున్న ఎన్నికల్లో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. ఇక సత్తుపల్లిలో 70వేల మెజార్టీతో సండ్ర గెలుపు ఖాయమన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గెలవనీయమని కొంతమంది మాట్లడుతున్నారని.. గడియారాలు, డబ్బులు పంచడం రాజకీయామా అంటూ ప్రశ్నించారు. 70రూపాయల గడియారం కావాలో ఆత్మగౌరవం కావాలో ప్రజలు తేల్చుకోవాలన్నారు. దళితుల శ్రేయస్సు కోసం బీఆరెస్ తప్ప ఎవరూ ఆలోచించరని వ్యాఖ్యానించారు.




Total views : 92309