Tuesday, June 30, 2026
News Navigation
Tuesday, June 30, 2026
News Navigation

Breaking

Tuesday, June 30, 2026
Home Telangana పేదల సంక్షేమం కోసం నిధులు

పేదల సంక్షేమం కోసం నిధులు

by Satya
Revanth Reddy

ఎన్నికల్లో నిర్దిష్టమైన విధానాలతోనే ప్రజల వద్దకు వెళ్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి చెప్పారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేవంత్‌ మాట్లాడారు. తాము ఎన్నుకున్న ప్రభుత్వాన్ని చూసి ప్రజలే భయపడేలా బీఆర్ఎస్ పాలన ఉందని విమర్శించారు. కేసీఆర్‌ పాలన ఎలా ఉందో యువత, రైతులు, మహిళలు అడిగితే బాగా చెబుతారన్నారు. ఈ ప్రాంత ప్రజల పోరాటంలో న్యాయం, ధర్మం ఉందని నమ్మి.. ఎన్ని రాజకీయ ఇబ్బందులు ఎదురైనా సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని రేవంత్‌ అన్నారు. ఈ పదేళ్లలో కేసీఆర్‌ ఏం చెప్పారు.. ఏం జరిగిందో ప్రజలు ఆలోచించాలని కోరారు. పేదల సంక్షేమం కోసం నిధులు ఉపయోగపడ్డాయో లేదో ఆలోచన చేయాలన్నారు. నిరసనలు తెలపడం వంటి ప్రజల ప్రాథమిక హక్కులను ప్రభుత్వం కాలరాసిందని ఆరోపించారు. స్వరాష్ట్రంలో ఎన్నో మార్పులు వస్తాయని ఆశించిన యువత ఆకాంక్షలు అడియాశలు అయ్యాయని రేవంత్‌ విమర్శించారు. పరీక్షల నిర్వహణలో టీఎస్‌పీఎస్సీ విఫలమైందని ఆరోపించారు. కేసీఆర్‌ ఇచ్చిన పాత హామీలనే అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారన్నారు. తెలంగాణ కోసం ఎందరో యువకులు ప్రాణత్యాగం చేశారని.. రాష్ట్ర చిహ్నంలో ప్రజల త్యాగాల గుర్తులు ఉండాలన్నారు.

Advertisements

You may also like

Our Visitor

036113
Total views : 180858

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.