కర్నాటక రాష్ట్రం బెంగుళూరులో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకి అపూర్వ స్వాగతం ఏర్పాట్లు. ఇవాళ బెంగుళూరు సిటీలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రానున్న చంద్రబాబు కోసం భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు. చిత్తూరు టిడిపి నాయకుడు జి.జే.ఎమ్ ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ గురజాల జగన్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో ఫ్లేక్సిలు,స్వాగత తోరణాలు ఏర్పాటు. రోడ్డుకి ఇరు వైపులా భారీ ప్లెక్కీలు,స్వాగత తోరణాలు ఎర్పాటు.
chandrababu
వంగవీటి మోహన రంగారావును హతమార్చింది తెలుగుదేశం ప్రభుత్వమేనని జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. చంద్రబాబు నన్ను కూడా చంపాలని చూశారని, కానీ చంపలేకపోయారన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వంగవీటి మోహన రంగా 35వ వర్ధంతి సందర్భంగా రంగా చిత్రపటానికి, విగ్రహానికి పూలమాలలు వేసిన ఘనంగా నివాళులర్పించారు. రంగాను టీడీపీ ప్రభుత్వం చంపిందని కన్నా లక్ష్మీనారాయణ ఎన్నోసార్లు చెప్పాడని గుర్తు చేశారు. పదవి శాశ్వతం కాదని, పదవి కోసం పాకులాడే వారిని చరిత్ర క్షమించదని కన్నాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. గతలో రాజశేఖర్ రెడ్డి వెంట నడిచానని, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తున్నానని తెలిపారు. జగన్ ను జైల్లో పెట్టిన తర్వాత అంబటిని కూడా జైల్లో పెడతారని అన్నారని నమ్ముకున్న మనిషి కోసం, సిద్ధాంతం కోసం ఎంతవరకైనా కట్టుబడి ఉంటానని అంబటి స్పష్టం చేశారు.
Read Also..
Read Also..
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడితో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సమావేశం ముగిసింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఈ సమావేశం 3 గంటల పాటు సాగింది. జగన్ ప్రభుత్వంపై లోతైన విశ్లేషణతో ప్రశాంత్ కిశోర్ ఓ నివేదికను చంద్రబాబుకు అందించారు. రాష్ట్ర యువతలో వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి ఉందని ఆ నివేదికలో పేర్కొన్నారు. ధరల పెంపు, కరెంటు చార్జీల పెంపు, పన్నులు, నిరుద్యోగం తదితర అంశాలు వచ్చే ఎన్నికల్లో వైసీపీ అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఆ నివేదికలో పొందుపరిచారు. దళితులు, బీసీలపై దాడులు వైసీపీకి ప్రతికూలంగా మారాయని… బీసీలు, దళితులను వైసీపీకి దూరం చేశాయని కూడా ప్రస్తావించారు. ఎవరో ఒకరిద్దరు మంత్రులను మినహాయిస్తే, మిగతా మంత్రులకు సున్నా మార్కులు పడతాయని నివేదికలో అభిప్రాయపడ్డారు. ప్రభుత్వానిది అహంకార ధోరణి అనే భావన ప్రజల్లో నెలకొందని కూడా వివరించారు. పరిస్థితులను అనుకూలంగా మార్చుకునేందుకు విపక్షం తగిన వ్యూహ రచన చేసుకోవాలని, యువతను ఆకర్షించేలా టీడీపీ కార్యాచరణ ఉండాలని నివేదికలో సూచించారు. ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని సిఫారసు చేశారు. చంద్రబాబు అరెస్ట్ కారణంగా… తటస్థంగా ఉండేవారిలోనూ, వైసీపీ వర్గాలోనూ జగన్ పై వ్యతిరేకత వచ్చిందని ప్రశాంత్ కిశోర్ నివేదికలో స్పష్టం చేశారు. కాగా, ప్రశాంత్ కిశోర్ తన నివేదికలో ఆయా వర్గాలు, అంశాల వారీగా ప్రభుత్వ బలాబలాలను కూడా విశ్లేషించారు.
ఏపీ రాజకీయాల్లో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. అనూహ్యంగా తెర మీదకు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రత్యక్షమయ్యారు. గన్నవరంలో ప్రత్యేక జెట్ లో నారా లోకేష్ తో పాటుగా దిగిన ప్రశాంత్ కిషోర్ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లారు. 2019 ఎన్నికల్లో జగన్ గెలుపు వెనుక కీలకంగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ ఈ ఎన్నికల వేళ చంద్రబాబుతో సమావేశం కావటం ఆసక్తి కరంగా మారుతోంది.
ప్రశాంత్ కిషోర్ 2014లో ప్రధాని మోదీ విజయంలో ప్రధాన భూమిక పోషించారు. ఆ తరువాత ఢిల్లీలో ఆప్, పంజాబ్ లో కాంగ్రెస్, ఏపీలో జగన్ విజయం వెనుక కీలకంగా వ్యవహరించారు. 2019 ఎన్నికల ముందే జగన్ నాడు ప్రశాంత్ కిషోర్ తో ఒప్పందం చేసుకున్నారు. జగన్ గెలుపు తరువాత ప్రశాంత్ కిషోర్ దూరంగా ఉన్నాఆయన టీం వైసీపీ కోసం పని చేస్తోంది. ఇదే సమయంలో ఐ ప్యాక్ లో పీకే సహచరులుగా ఉన్న రాబిన్ శర్మ ప్రస్తుతం టీడీపీకి రుషి రాజ్ సింగ్ వైసీపీ కోసం పని చేస్తున్నారు. ఈ సమయంలో కొంత కాలంగా ప్రశాంత్ కిషోర్ కోసం టీడీపీ ప్రయత్నిస్తోందనే వార్తలు వచ్చాయి.
ప్రశాంత్ కిషోర్ ప్రస్తుత ఏపీ రాజకీయాల పైన కొద్ది రోజుల క్రితం కీలక వ్యాఖ్యలు చేసారు. జగన్ 2019 ఎన్నికల్లో ఇచ్చిన సంక్షేమ హామీల వెనుక ప్రశాంత్ కిషోర్ ఉన్నారు ఇప్పుడు చంద్రబాబు, జనసేనతో పొత్తుతో వెళ్లటంతో పాటుగా సంక్షేమ మేనిఫెస్టో పైన కసరత్తు చేస్తున్నారు. ఈ సమయంలో ప్రశాంత్ కిషోర్ టీం ఏపీలో చేసిన సర్వే నివేదికలను చంద్రబాబుకు అందించినట్లు సమాచారం. టీడీపీ ఎక్కడ బలహీనంగా ఉందీ ఏ రకంగా ముందుకు వెళ్లాలనే దాని పైన సూచనలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఎన్నికలు పూర్తయ్యే వరకూ టీడీపీకి పీకే సూచనలు, సలహాలు కొనసాగుతాయని పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో, పీకే ఎంట్రీతో టీడీపీ కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తుందా జగన్ ఎలా ఎదుర్కొంటారు. మొత్తంగా ఏపీ రాజకీయం ఎలాంటి టర్న్ తీసుకుంటుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.
ప్రశాంత్ కిషోర్ పశ్చిమ బెంగాల్ ఎన్నికల తరువాత ఇక తాను రాజకీయ వ్యూహకర్తగా పని చేయనని ప్రకటించారు. బీహార్ లో సొంత పార్టీ ఏర్పాటు చేసి పాదయాత్ర చేస్తున్నారు. కొద్ది రోజులు క్రితం ప్రశాంత్ కిషోర్ తో ఢిల్లీలో భేటీ అయ్యారు. తమ పార్టీకి వ్యూహకర్తగా పని చేయకపోయినా రాజకీయ సలహాదారుగా వ్యవహరించాలని కోరారు. ఒకసారి చంద్రబాబుతో సమావేశానికి రావాలని ఆహ్వానించారు. ఈ మేరకు ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ తాడేపల్లి చేరుకున్నారు. ప్రశాంత్ కిషోర్ గతంలో జగన్ కోసం పని చేసి ఉండటంతో జగన్ బలాలు, బలహీనతలు, వ్యూహాల పైన పూర్తి అవగాహన ఉందని టీడీపీ నేతలు నమ్ముతున్నారు. దీంతో, ఇప్పుడు అదే ప్రశాంత్ కిషోర్ టీడీపీ కోసం పని చేస్తే జగన్ ను ఓడించటంలో సహకరిస్తుందని విశ్వసిస్తున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఉండవల్లిలోని తన నివాసంలో చండీయాగం, సుదర్శన నారసింహ హోమం నిర్వహించారు. చంద్రబాబు, నారా భువనేశ్వరి దంపతులు ఈ క్రతువుల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు దేవినేని ఉమా, ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, కొల్లు రవీంద్ర, బోండా ఉమ, నారాయణ, కన్నా లక్ష్మీనారాయణ తదితరులు కూడా పాల్గొన్నారు. ఏపీలో మరి కొన్ని నెలల్లో ఎన్నికలు రానుండడం, ఇటీవల చంద్రబాబు జైలు నుంచి విడుదల కావడం, నారా లోకేశ్ యువగళం విజయవంతంగా ముగియడం తదితర పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు ఇంట హోమాలు నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
నారా లోకేష్ది అట్టర్ ప్లాప్ యాత్ర అని సెటైరికల్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. చంద్రబాబు పాపపు సొమ్ముతో లోకేష్ యాత్ర చేశారు. యువగళం యాత్రతో టీడీపీ ఏం సాధించిందని పేర్ని నాని ప్రశ్నించారు. మీడియాతో మాట్లాడుతూ నారా లోకేష్ అట్టర్ ప్లాప్ సినిమా. అది పాదయాత్ర కాదు జంపింగ్ జపాంగ్ యాత్ర. లోకేష్ యాత్ర కోసం వచ్చి మేనమామ కొడుకు చనిపోతే ఆపలేదు. కానీ, చంద్రబాబు జైలుకు వెళ్తే మాత్రం యాత్రను ఆపేశారు. ప్రజల కోసం పనిచేసే నాయకుడు సమస్యల పరిష్కారానికి ఆలోచిస్తాడు. యువగళం యాత్ర పేరుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని బూతులు తిట్టారు. రాజకీయ లబ్ధి కోసమే మొక్కుబడి యాత్ర చేశారు. సాయంత్రం సూర్యుడు దిగిపోయాక లోకేష్ బయటకు వస్తారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
బాపట్ల పట్టణము 33వ వార్డులో గత 70 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న వారిని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అధికారులు వచ్చి స్థానికులతో ఇది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ స్థలం అని వారిని ఖాళీ చేయాలనీ చెప్పటం తో అక్కడి ప్రజలకు ఏంచెయ్యాలో అర్ధం కావడం లేదు. ప్రజల సమస్యను తెలుసుకున్న వేగేశన నరేంద్ర వర్మ వారికీ ధైర్యం చెప్పి తెలుగుదేశం పార్టీ అధికారం లోకి వచ్చిన వెంటనే చంద్రబాబు దృష్టికి సమస్యను తీసుకువెళ్తాను అని హామీ ఇచ్చారు. వారు నివాసం ఉంటున్న స్థలాలకు నివేశన పట్టాలు ఇచ్చి మీకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని తెలిపారు.
యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి వస్తామని కలలుగన్న జనసైనికులకు సమాధానం చెప్పాలని పవన్ ను ప్రశ్నించారు హరిరామ జోగయ్య. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామజోగయ్య సంచలన లేఖ రాశారు. చంద్రబాబు ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి అనే మాటకు రెండో మాట లేదని అనుభవంతుడైన నాయకత్వం కావాలి అనే మాటను పలుసార్లు పవన్ కళ్యాణ్ ప్రకటించాడని జోగయ్య అన్నారు. అంటే పూర్తికాలం చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉండేందుకు మీ ఆమోదం ఉందా అని పవన్ ను ప్రశ్నించారు. రాబోయే కాలంలో చంద్రబాబు నాయకత్వాన్ని పవన్ నిజంగా సమర్థిస్తున్నాడా? ఒకవేళ సమర్థిస్తే బడుగు బలహీన వర్గాల పరిస్థితి ఏంటని జనసేనానిని నిలదీశారు హరిరామజోగయ్య. ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రెండే సామాజిక వర్గాలు రాజ్యమేలుతున్నాయని జోగయ్య విమర్శించారు. 80 శాతం ఉన్న బడుగు, బలహీనవర్గాలకు మోక్షం ఎప్పుడు రాజ్యాధికారాన్ని చేపట్టే విషయంలో మీ వైఖరి స్పష్టం చేయాలని జనసేనానిని ప్రశ్నించారు హరిరామ జోగయ్య.
యువగళం పాదయాత్ర సభ దిగ్విజయం అయిన సందర్భంగా టిడిపి కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ నారా లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సభ నవశకానికి నాంది పలికిందన్నారు. వైసిపి ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు కలుగజేసిన ఈరోజు యువగళం పాదయాత్ర దిగ్విజయంగా పూర్తయిందని ఆయన అన్నారు. యువగళం పాదయాత్ర లో ప్రతి 100 కిలోమీటర్ల చొప్పున ఒక హామీని శిలాపలక రూపంలో వేశారు అది అక్షరాల నిర్వహించే బాధ్యత టిడిపి ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు. 92 నియోజకవర్గాలలో 3,152 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసిన నారా లోకేష్ గారికి అభినందనలు తెలిపారు. యువగళం పాదయాత్ర లో వైసిపి చేసిన అరాచకాలను, అసమర్ధ పాలన గురించి నారా లోకేష్ ప్రజలకు తెలియజేశారు. అలాగే ప్రతి గ్రామంలో ప్రజల యొక్క సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశలో నారా లోకేష్ కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. బహిరంగ సభకు హాజరైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, నారా లోకేష్, ఐదు లక్షల మంది ప్రజలు విచ్చేసి ఈ సభను విజయవంతం చేశారు. వీళ్ళందర్నీ ఓకే వేదిక పైన చూడడంతో జగన్మోహన్ రెడ్డికి నిద్ర పట్టట్లేదు అని ఆయన ఎద్దేవాచేశారు.
తాడేపల్లి తలుపులు బద్ధలు కొట్టేవరకు తన యుద్ధం ఆగదన్నారు టీడీపీ జాతీయ ప్రధాని కార్యదర్శి నారా లోకేష్. యువగళం-నవశకం సభలో మాట్లాడుతూ ప్రజలు పాదయాత్ర చేస్తే పోరాటం అవుతుందని రాక్షస పాలనలో పోరాటం చేస్తే విప్లవమవుతుందని ఆయన అభివర్ణించారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని జగన్ దెబ్బతీశారని మూడు నెలల్లో ప్రజాస్వామ్యం పవర్ ఎంటో చూపిస్తామన్నారు.




Total views : 90222