Thursday, May 14, 2026
News Navigation
Thursday, May 14, 2026
News Navigation

Breaking

Thursday, May 14, 2026
Home Andhra Pradesh అంబటి రాంబాబు ఆరోపణ

అంబటి రాంబాబు ఆరోపణ

by Satya
Ambati Rambabu

వంగవీటి మోహన రంగారావును హతమార్చింది తెలుగుదేశం ప్రభుత్వమేనని జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. చంద్రబాబు నన్ను కూడా చంపాలని చూశారని, కానీ చంపలేకపోయారన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వంగవీటి మోహన రంగా 35వ వర్ధంతి సందర్భంగా రంగా చిత్రపటానికి, విగ్రహానికి పూలమాలలు వేసిన ఘనంగా నివాళులర్పించారు. రంగాను టీడీపీ ప్రభుత్వం చంపిందని కన్నా లక్ష్మీనారాయణ ఎన్నోసార్లు చెప్పాడని గుర్తు చేశారు. పదవి శాశ్వతం కాదని, పదవి కోసం పాకులాడే వారిని చరిత్ర క్షమించదని కన్నాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. గతలో రాజశేఖర్ రెడ్డి వెంట నడిచానని, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తున్నానని తెలిపారు. జగన్ ను జైల్లో పెట్టిన తర్వాత అంబటిని కూడా జైల్లో పెడతారని అన్నారని నమ్ముకున్న మనిషి కోసం, సిద్ధాంతం కోసం ఎంతవరకైనా కట్టుబడి ఉంటానని అంబటి స్పష్టం చేశారు.

Read Also..

Read Also..

Advertisements

You may also like

Our Visitor

012580
Total views : 75480

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.