పల్నాడు జిల్లా.. నరసరావుపేట పార్లమెంట అభ్యర్థి లావు శ్రీ కృష్ణ దేవరాయలు 104950 ఆధిక్యంలో ఉన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గం 17రౌండ్లు పూర్తి అయ్యేసరికి టిడిపి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ 24366 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. వినుకొండ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జి.వి ఆంజనేయులు 17 వ రౌండ్ 23348 ఓట్ల మెజారిటీతో అధిక్యం ఉన్నారు.
Kanna Lakshminarayana
పల్నాడు జిల్లా, సత్తెనపల్లి ఐదు లాంతర్ల సెంటర్ వంగవీటి రంగా విగ్రహానికి పూలమాలలతో ఘన నివాళులర్పించిన మాజీ మంత్రి సత్తెనపల్లి టిడిపి ఇంఛార్జి కన్నా లక్ష్మీనారాయణ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద బడుగు వర్గాలకు అండగా ఈ రాష్ట్రంలో ఒక శక్తిగా ఎదిగిన వ్యక్తి రంగా. ఆయన ఆశయాలను వదిలేసి ఆయన పేరుతో రాజకీయం చేస్తున్నారు కొంతమంది వ్యక్తులు. ఖమ్మంలో కమ్యూనిస్టులు హైదరాబాద్ పార్టీ మీటింగ్ కి వెళ్ళవలసి ఉండగా పార్టీ జెండాలు పక్కన పడేసి రంగా మీటింగ్ కి వచ్చిన సందర్భం ఉంది. నేనొక్కడినే చేయాలి అనే సిద్ధాంతం ఏమిటి, ఎక్కడ మీకు పేటెంట్ రైట్ ఉంది రంగా వర్ధంతి చేసుకోవడానికన్నా. రంగా గారి పేరు మీద రాజకీయాలు చేయొద్దు. ఆయన ఆశయం కోసం పనిచేశాడు. రంగా గారి ఆశయాలు అనుగుణంగా జీవితాంతం పనిచేస్తామని తెలియజేస్తున్నాను అని చెప్పారు.
వంగవీటి మోహన రంగారావును హతమార్చింది తెలుగుదేశం ప్రభుత్వమేనని జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. చంద్రబాబు నన్ను కూడా చంపాలని చూశారని, కానీ చంపలేకపోయారన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వంగవీటి మోహన రంగా 35వ వర్ధంతి సందర్భంగా రంగా చిత్రపటానికి, విగ్రహానికి పూలమాలలు వేసిన ఘనంగా నివాళులర్పించారు. రంగాను టీడీపీ ప్రభుత్వం చంపిందని కన్నా లక్ష్మీనారాయణ ఎన్నోసార్లు చెప్పాడని గుర్తు చేశారు. పదవి శాశ్వతం కాదని, పదవి కోసం పాకులాడే వారిని చరిత్ర క్షమించదని కన్నాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. గతలో రాజశేఖర్ రెడ్డి వెంట నడిచానని, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తున్నానని తెలిపారు. జగన్ ను జైల్లో పెట్టిన తర్వాత అంబటిని కూడా జైల్లో పెడతారని అన్నారని నమ్ముకున్న మనిషి కోసం, సిద్ధాంతం కోసం ఎంతవరకైనా కట్టుబడి ఉంటానని అంబటి స్పష్టం చేశారు.
Read Also..
Read Also..
పల్నాడు జిల్లా సత్తెనపల్లి లో వంగవీటి మోహన్ రంగా 35వ వర్ధంతి సందర్భంగా రంగ చిత్ర పటానికి, విగ్రహాలకు పూలమాలలతో ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంగవీటి మోహన్ రంగాను హతమార్చింది తెలుగుదేశం ప్రభుత్వమేనని అందుకే టిడిపిని దించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారని ఆయన అన్నారు. కన్నా లక్ష్మీనారాయణ ఎన్నోసార్లు టిడిపి ప్రభుత్వం రంగాను చంపిందని చంద్ర బాబే చంపాడన్నారు. చంద్రబాబు నన్ను కూడా చంపాలని చూసాడు కాని నన్ను చంపలేకపోయాడని నారాయణ అప్పట్లో అన్నారు. పదవే శాశ్వతమా, పదవి కోసం పాకులాడాలా, పదవి కోసం పాకులాడే వారిని ఈ సమాజం క్షమించకూడదని కన్నాని ఉద్దేశించి మంత్రి అంబటి రాంబాబు అన్నారు. రాజశేఖర్ రెడ్డి వెంబడి నడిచాను ఆయన తర్వాత జగన్మోహన్ రెడ్డి వెంబడే నడిచాను అని అన్నారు. ఆరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని ఎవరైనా ఊహించారా. జగన్ ను జైల్లో పెడతానన్నారు అలాగే నన్ను కూడా జైల్లో పెడతారు అన్నారు. సిబిఐ కూడా నన్ను పిలిచింది అయినా నేను నమ్ముకున్న మనిషి కోసం సిద్ధాంతం కోసం కట్టుబడి ఉన్నాను.





Total views : 140894