చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన లేట్ రెడ్డప్ప కుమారుడు హేమంత్ మనీ, పురుగుల మందు తాగడంతో గమనించిన కుటుంబీకులు హుటాహుటిన పలమనేరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, అప్పటికే మృతి చెందారని వైద్యులు తెలపడంతో ఆసుపత్రి వద్ద కుటుంబీకులు బోరుమన్నారు, సమాచారం అందుకున్న పోలీసులు విచారిస్తున్నారు వారి దర్యాప్తులో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
chitoor district news
జగన్ కి ఓటు వేస్తే నడి రోడ్డుకు తెచ్చేశాడు. జగనన్న ఇళ్లు అని మోసం చేశాడు. తుఫానులో ఇళ్లు అన్ని కొట్టుకుని పోయాయి. కనీసం తాగడానికి నీళ్ళు ఇవ్వలేదు, అన్నం పెట్టలేదు. శ్రీకాళహస్తిలో బీసీ హాస్టల్ లో పెట్టిన తుఫాను బాధితులు జనసేన పార్టీ ఇంఛార్జి వినుత కోటా గారితో ఆవేదన వ్యక్తం చేశారు.
శ్రీకాళహస్తి జనసేన పార్టీ కార్యాలయంలో ఇంఛార్జి వినుత కోటా, వీరమహిళలు, జనసైనికులతో 2,000 మంది తుఫాను బాధితులకు బోజన ఏర్పాట్లు చేసారు.
చిత్తూరు జిల్లాలోని బైరెడ్డిపల్లి మండలంలో ఏనుగులు గుంపు భీభత్సం సృష్టించాయి. వివరాల్లోకి వెళితే కడతట్లపల్లి గ్రామానికి చెందిన మహిళ రైతు వరలక్ష్మి గత 6 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నది. తన మూడు ఎకరాల పొలంలో అరటి తోట వేసి,ప్రకృతిలో దొరికే ఆకుల జీవామృతంతో పిచికారీ చేసి పంట దిగుబడి చేసింది. రెండు రోజుల్లో కోత కోయాల్సిన తరణం అసన్నమైoది.కానీ ప్రకృతి వ్యవసాయ మహిళా రైతు వరలక్ష్మి కి ఆశలు ఆవిరినాయి. ఒక్కసారిగా సోమవారం రాత్రి ఏనుగులు గుంపు అరటి తోటలో పడి భీభత్సం సృష్టించాయి. తెల్లవారి చూసే సరికి నేలమట్టంలో అరటి గెలలు దర్శనం ఇచ్చాయి.సంవత్సర కాల పంటలు సాగుకు ప్రభుత్వం సాయం అందించాలని కోరారు. సంవత్సరాలుగా పంటలు చేస్తున్నాం, కోత దశ వచ్చే సరికి ఏనుగులు చొరబడి నష్టం చేకురుస్తున్నాయి.కానీ 4 సంవత్సరాలుగా నష్ట పరిహారం ఒక్కరూపాయి కూడ చేకూర్చిన దాఖలాలు వైకాపా ప్రభుత్వంలో లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నది. తెదేపా ప్రభుత్వంలో నష్ట పరిహారం అందినది. నాటిని మొలకలకు కూడా 30 వేలు ఆర్థికం అందినదని హర్షం వ్యక్తం చేసింది. వైకాపా ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఒక్క రూపాయి కూడ నష్ట పరిహారం అందలేదు..ఇప్పుడున్న మా పరిస్థితి చూసి మాకు నెలకొన్న సమస్యను చూసి నష్ట పరిహారం ఇవ్వాలని సుమారు రెండు లక్షలు నష్టం చేకూరిందని ఆవేదన వ్యక్తం చేసింది.
శ్రీకాళహస్తి స్వామి వారి సేవలో సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్. శ్రీకాళహస్తి స్వామి అమ్మ వారిని సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ దర్శించుకున్నారు. వీరికి ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు ఘనస్వాగతం పలికి ప్రత్యేక దర్శనం చేయించారు. అనంతరం గురుదక్షిణామూర్తి వద్ద వేద పండితులచే ప్రత్యేక ఆశీర్వచనం ఇప్పించి స్వామి అమ్మవాళ్ళ తీర్థప్రసాదాలు చిత్రపటం అందజేశారు..





Total views : 78238