సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భాగంగా ఈరోజు మందమర్రి పట్టణ పోలీస్ ఆధ్వర్యంలో CRPF జవాన్ లతో పాటు మందమర్రి పోలీస్ సర్కిల్ పరిది సిబ్బందితో cisf బ్యారక్ నుండి మందమర్రి రైల్వేస్టేషన్ రోడ్ మార్కెట్ ఏరియా వరకు వివిధ బస్తి లలో పోలీస్ కవాతు నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమం లో బెల్లంపల్లి ఏసీపీ పి. సదయ్య, మంచిర్యాల డీసీపీ సుదీర్ కేకన్ CRPF అధికారులు, సీఐ మహేందర్ రెడ్డి మందమర్రి సర్కిల్ పరిది నాలుగు పిఎస్ ఎస్ఐ లు పాల్గొన్నారు. ఇట్టి పోలీస్ కవాతు అనంతరం బెల్లంపల్లి ఏసీపీ సదయ్య మాట్లాడుతూ.. తెలంగాణ సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ప్రశాంతంగా ఎన్నికల ప్రక్రియ జరిగేందుకు మరియు ప్రజలు నిర్భయంగా తమ ఓటును వినియోగించుకునేందుకు ప్రజలకు మేము వున్నాము అనే భరోసాను కల్పించుటకు గాను ఇట్టి పోలీస్ కవాతు నిర్వహించటం జరిగిందని, అదేవిధంగా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అన్నీ రాజకీయ పార్టీలు సహకరించాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడవద్దని, చివరి ఘట్టంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించి కేసుల పాలవద్దని పోలీస్ లకు ప్రజలు సహకరించాలని కోరారు.
Tag:






Total views : 91136