ఆంధ్రప్రదేశ్ లో మిచాంగ్ తుపాను ప్రభావం తీవ్ర స్థాయిలో ఉంది. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా వేలాది ఎకరాల్లో వరి పంట ఈదురు గాలులకు నేలకు వరగడం, దానికి తోడు భారీ వర్షాలకు పూర్తిగా గింజ మొక్కలు వచ్చి ధాన్యం పాడైపోతున్న ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఎటువైపు చర్యలు తీసుకోలేదని, చంద్రబాబునాయుడు విజ్ఞప్తి మేరకు కేంద్ర కమిటీ రంగంలోకి దిగి నష్టాన్ని అంచనా వేస్తున్నారని, ఎ ముఖ్యమంత్రి అయిన విపత్తు సంభవించిన వెంటనే కేంద్రానికి తెలియపరుస్తారు కానీ, ఆంధ్రప్రదేశ్ లో దానికి విరుద్ధంగా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ప్రజల పక్షాన కేంద్రానికి లేఖ రాశారని, తక్షణమే ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని మాజీ మండలి డిప్యూటీ స్పీకర్ బుద్ధ ప్రసాద్ కోరారు.
cyclone effect
తుఫాను ప్రభావం తో శ్రీకాకుళం జిల్లాలో గత మూడు రోజులుగా మోస్తారుగా వర్షాలు కురిసాయి. ఈ వర్షాలకు ఎచ్చెర్ల, రణస్థలం, లావేరు మండలాల్లో వరి పంట నేలకొరిగింది. పంట చేతికొచ్చే సమయంలో వర్షాలు కురవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. పంట నేలకొరిగి నీట మునగడంతో రంగు మారే అవకాశం ఉందని, ప్రభుత్వం రంగు మారిన ధాన్యాన్ని కొని తమను ఆదుకోవాలని రైతులు కోరుకుంటున్నారు…
కాకినాడ జిల్లా అన్నవరం మిచౌంగ్ తుఫాన్ ప్రభావం తో అన్నవరం పంపా నదిలో పెను సుడిగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి.సుడిగాలి బీభత్సంతో అన్నవరం దేవస్థానం ఘాట్ రోడ్ వెంబడి చెట్లు కొమ్మలు విరిగి పడ్డాయి. కొండపై సుడిగాలి కి రామాలయం వద్ద షెడ్ రేకులు ఎగిరి పడ్డాయి. ఎగిరిన రేకులు పడటంతో ఇద్దరు మహిళా భక్తుల కు గాయాలయ్యాయి. చికిత్స కోసం తుని ప్రభుత్వ ఆస్పత్రికి దేవస్థానం సిబ్బంది తరలించారు. విద్యుత్ స్తంభాలు నేలకు వరగడంతోఅన్నవరం, చుట్టుపక్కల ప్రాంతాలు అంధకారంలో ఉండిపోయాయి. యుద్ధ ప్రాతిపదికన అధికారులు విద్యుత్ మరమ్మతులు చేపట్టారు.
పశ్చిమగోదావరి జిల్లా తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు పాలకొల్లు నియోజకవర్గం లో తడిసిన, నష్టపోయిన ధాన్యం రాశులను, కుండాపోతగా . కురుస్తున్న వర్షం లోనే mla రామానాయుడు తడుస్తూ పర్యటించారు. వర్షానికి తడుస్తున్న ధాన్యం రాశులను కాపాడుకుంటున్న రైతులతో కలిసి ఆయన పారపట్టారు. తడిసిన, మొలకెత్తిన, రంగు మారిన ధాన్యం ను ఎటువంటి నిబంధనలు లేకుండా ప్రభుత్వం ఎక్కడికి అక్కడే ఓబ్బిడి జరిగేలా కొనుగోలు చేయాలి. భారీ వర్షాలకు కల్లాలపై ఉన్న ధాన్యం రాశులు తడిసిపోయాయి. వరిచేలు నేలకోరిగాయి. ధాన్యం కొనుగోలులో తేమశాతం నిబంధనల సడలింపు వారం రోజుల కిందటే ప్రభుత్వం తీసుకొని ఉంటే రైతాంగం నష్టపోయేవారు కాదు.తుఫాను ప్రభావం కోస్తా ప్రాంతంలో తీవ్రంగా ఉంటుందని పది రోజుల కిందటే వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లనే రైతులు కోలుకోలేని విధంగా నష్టపోయారు. తుఫాను ఉపద్రవం ముంచుకొచ్చిన తర్వాత ప్రభుత్వం తేమ శాతం నిబంధనలు సడలించడం, ప్రత్యేక అధికారులను నియమించడం వలన జరిగిన నష్టాన్ని తీర్చలేము. తుఫాను ప్రభావ ముందస్తు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైనందువలనే రైతులతో పాటు మత్స్యకారులు, ఆక్వా రైతులు, ఇతర వ్యవసాయ రైతులు తీవ్రంగా నష్టపోయారు..






Total views : 90600