హన్మకొండ జిల్లా, అంబేద్కర్, జితేందర్ సింగ్ నగర్ లో పదేండ్ల క్రితం నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లలోకి స్థానిక గుడిసె వాసులు. 200మంది గుడిసే వాసులు వెళ్లేందుకు సిద్ధం. గుడిసె వాసులతో పోలీస్ చర్చలు. ప్రెస్ క్లబ్ సమీపంలో రోడ్డు పై బైటయించిన గుడిసె వాసులు. డబుల్ బెడ్ రూమ్ పరిసరాలలో భారీగా పోలీసుల మోహరింపు.
Double bedroom house
వరంగల్ ఉమ్మడి జిల్లాలో BRS ఎమ్యెల్యే అభ్యర్థులకు వ్యతిరేక పవనాలు తప్పడం లేదు. తాజాగా వర్ధన్నపేట ఎమ్యెల్యే అభ్యర్థి అరూరి రమేష్ పై నియోజకవర్గ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. హనుమకొండ జిల్లా హాసన్ పర్తి మండల్ మండపల్లి గ్రామాన్ని గత తొమ్మిది సంవత్సరాల బట్టి దత్తత తీసుకున్న వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మడిపల్లి గ్రామంలో ఏమాత్రం అభివృద్ధి చేయలేదని 2018లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు శంకుస్థాపన చేసి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరు మీద వందల ట్రిప్పుల ఇసుక ముఖ్య అనుచరుడు అమ్ముకున్నారు. ఇప్పటివరకు ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు గాని ఒక దళిత బంధు యూనిట్ కొత్త రేషన్ కార్డు ఏవి కూడా మడిపల్లి గ్రామ ప్రజలకు అందలేదని ఓటు అడిగే నైతిక హక్కు ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కు లేదని మడిపల్లి గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Also..
బి ఆర్ ఎస్ పార్టీ మునిగిపోయే పడవ లాంటిదని, ఎంతమంది చేరినా ఒక సున్న తర్వాత మరో సున్నా చేరినట్టేనన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లు రవి. వారి వల్ల ఆ పార్టీకి ఎలాంటి ఉపయోగం లేదన్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల కాంగ్రెస్ అభ్యర్థి అనిరుద్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ నిర్వహించిన భారీ ర్యాలీలో మల్లు రవి పాల్గొన్నారు. పార్టీ శ్రేణులు బాలనగర్ నుండి రాజపూర్ జడ్చర్ల వరకు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. అనంతరం మల్లు రవి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నాయకుడు ఎర్ర శేఖర్ టికెట్ దక్కకపోవడంతో బిఆర్ఎస్ పార్టీలో చేరారని తమ పార్టీకి నష్టమేమీ లేదని మల్లు రవి అన్నారు. ఈ ఎన్నికల్లో 50వేల మెజారిటీతో అనిరుద్ రెడ్డి విజయం సాధించబోతున్నారన్నారు. అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థి అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ తాను గెలిచిన వంద రోజుల్లో నియోజకవర్గంలోని నిరుపేదల కోసం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లతో పాటు అనేక అభివృద్ధి పనులు చేపడతానని ఆయన అన్నారు.





Total views : 77819