రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు మండలం పెద్దమ్మతండా, దావుద్ గూడతండా, పులిమామిడి, దన్నారం, చిప్పలపల్లి, మురలీనగర్ గ్రామాలలోఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న _తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. అడుగడుగున జననీరాజనంతో ఘన స్వాగతం పలికిన కార్యకర్తలు. భారీగా హాజరైన గ్రామవాసులు.మేమంతా మీతోనే మీకు అండగా ఉంటామని ముక్తకంఠంతో పలికిన గ్రామాల ప్రజలు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందింది అంటే అది కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంతోనే అన్ని రంగాలను అభివృద్ధి పరచుకుంటూ ముందుకెళ్తున్నామన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ని మరొకసారి ఆశీర్వదించి ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి చేయాలని, అదే విధంగా మహేశ్వరం నియోజకవర్గం గడిచిన నాలుగున్నర సంవత్సరాల కిందట ఎట్లా ఉండే ప్రస్తుతం ఇప్పుడు ఎట్లా ఉందో ఆలోచించాలన్నారు. అభివృద్ధి చేశాను మరింత అభివృద్ధి కోసం మీ సబితమ్మను ఆశీర్వదించి మరొకసారి గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలు పరుస్తున్నామని మరింత అభివృద్ధి కోసం మరొకసారి బిఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటు వేసి దీవించవలసిందిగా పేర్కొన్నారు.
Election Campaign
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం కు సీఎం కేసీఆర్ రానున్నారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి సభా ఏర్పాట్లు పరిశీలించారు. మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం అభివృద్ధి కి ముఖ్యమంత్రి సహకరిస్తున్నారని , ఇబ్రహీంపట్నం లోని అనేక కంపెనీలు రావడం వలన ఎంతో అభివృద్ధి చెందుతుందని , సాగర్ రోడ్డు వైపు సాఫ్టువేరు కంపెనీలు రావడం తో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రానున్నాయని , ఫార్మాసిటీ , శివన్న గూడ ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా ఇబ్రహీంపట్నం మరింత అభివృద్ధి చెందుతుందని మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు . ఇబ్రహీంపట్నం కేంద్రంలో భారీ బహిరంగ సభకు ప్రజలు భారీఎత్తున తరలిరావాలని , కేసీఆర్ ఇచ్చే ప్రసంగం వినాలని , ఇబ్రహీంపట్నం అభివృద్ధి కి చేయడం కోసం ముఖ్యమంత్రి వస్తున్నారని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు.
ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం ఎదులాపురంలో ఎన్నికల ప్రచారంలో పాలేరు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు పాల్గొన్నారు. వీరికి గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. ఈ గ్రామంలో ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ నేను చేసేదే చెబుతా, చెప్పిందే చేస్తా, అబద్ధం చెప్పనని అన్నారు. నిన్నటి దాకా కేసీఆర్ దేవుడని, రాజకీయాల కోసం సీటు ఇవ్వలేదని ఇప్పుడు దెయ్యం అంటున్నారని అన్నారు. నేను కూడా 2018 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుండి అన్ని పార్టీల సహాయంతో గెలిచానని ఎన్నడూ ఏ మాత్రంని తిట్టలేదని అన్నారు. నేను లోకల్ వాడిని అని, వ్యాపార నిమిత్తం హైదరాబాద్ వెళ్లి వస్తుంటానని, నన్ను నాన్ లోకల్ అంటున్నారు. కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి లోకల్ వాడు కాదని అన్నారు. కొందరు బయట వ్యక్తులు వచ్చి డబ్బులతో ఓటర్లని కొనాలని చూస్తున్నారు. ఈ ఎదులాపురం బొడ్డు రాయి దగ్గర కూర్చుందాం, ఎవరు ఎన్ని సార్లు వచ్చారు, ఎవరు ఏమీ అభివృధి చేశారో చూద్దామని అన్నారు. రాత్రికి రాత్రి పార్టీ మారి కాంగ్రెస్ వాళ్లు కమల్ హాసన్, నటరాజ్ లాగా యాక్షన్ చేస్తున్నారని అన్నారు. కావున ఈ గడ్డ బిడ్డనైనా నన్ను కారు గుర్తుపై ఓటు వేసే నన్ను గెలిపించాలని ఆయన అన్నారు.
జనగామ జిల్లా నియోజకవర్గంలోని వివిధ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొమ్మూరు ప్రతాపరెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ BRS పార్టీ తెలంగాణ మోసం చేసిందని కాలేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్లు దండుకున్నారని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ 2018 ఎన్నికల సమయంలో టిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలను ఒకటి కూడా నెరవేర్చలేదని అన్ని మోసపూరిత హామీలు ఇస్తుందని మరోసారి తెలంగాణ ప్రజలు మోసపోవద్దని ఒకసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు.
ఈరోజు అనగా 4-11-23 వ తేదీ శనివారం మరియు రేపు అనగా 5-11-23 వ తేదీ ఆదివారం రెండు రోజులు అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద బూతు స్థాయి అధికారులు అందుబాటులో ఉండి ఓటర్ల నమోదు చేర్పులు మార్పులు తొలగింపులకు సంబంధించి దరఖాస్తులు స్వీకరిస్తారని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు తెలిపారు. కావున ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసినదిగా జిల్లా కలెక్టర్ కోరారు.





Total views : 91162